బంజారాహిల్స్‌లో దారుణం.. కత్తులతో పొడిచి యువకుడి హత్య..

| Edited By:

Jan 15, 2020 | 10:45 AM

హైదరాబాద్ బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో దారుణం ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిని కొందరు యువకులు కత్తులతో పొడిచి హత్యచేశారు. గౌరీశంకర్ కాలనీ జహ్రానగర్‌కు చెందిన సర్వర్ అలియాస్ చోటు.. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మద్యం మత్తులో చెలరేగిన ఓ వివాదంతో.. అతని స్నేహితులే కత్తులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలతో పడిఉన్న చోటును.. ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఘటన జరిగిన ప్రదేశంలో క్లూస్ టీం […]

బంజారాహిల్స్‌లో దారుణం.. కత్తులతో పొడిచి యువకుడి హత్య..
Follow us on

హైదరాబాద్ బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో దారుణం ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిని కొందరు యువకులు కత్తులతో పొడిచి హత్యచేశారు. గౌరీశంకర్ కాలనీ జహ్రానగర్‌కు చెందిన సర్వర్ అలియాస్ చోటు.. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మద్యం మత్తులో చెలరేగిన ఓ వివాదంతో.. అతని స్నేహితులే కత్తులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలతో పడిఉన్న చోటును.. ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఘటన జరిగిన ప్రదేశంలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. సంఘటనా స్థలంలో మందు బాటిల్‌తో పాటు లు మరికొన్ని ఆనవాళ్లను కూడా గుర్తించింది. ఇదిలా ఉంటే.. ఈ హత్య తామే చేశామంటు కొందరు పోలీసులు ఎదుట లొంగిపోయారు.