ఆ ఇద్దరు వివాహితులు ప్రేమించుకున్నారు..కానీ, అంతలోనే ఇలా..

|

May 30, 2020 | 12:08 PM

ఇద్దరూ వివాహితులే..అయినప్పటికీ ఇద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి జీవించేందుకు పిల్లల్ని, కుటుంబాల్ని విడిచిపెట్టారు. ఏమైందో ఏమో తెలియదు గానీ, చివరకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రమాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

ఆ ఇద్దరు వివాహితులు ప్రేమించుకున్నారు..కానీ, అంతలోనే ఇలా..
Follow us on

ఇద్దరూ వివాహితులే..అయినప్పటికీ ఇద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి జీవించేందుకు పిల్లల్ని, కుటుంబాల్ని విడిచిపెట్టారు. ఏమైందో ఏమో తెలియదు గానీ, చివరకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రమాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, కటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..

సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన యువకుడు, గ్రామానికి చెందిన యువతికి మొదటగా వేరే వ్యక్తులతో వివాహం జరిగింది. ఇద్దరికీ ఇద్దరిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా, ఇరువురి మధ్య ఏర్పడ్డ పరిచయం బలపడి ప్రేమగా మారింది. కలిసి జీవించేందుకు కుటుంబాలను వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్లారు. ఏడాది క్రితం ఇరువురు ఇండ్ల నుంచి వెళ్లిపోయారు. వీరి తిరిగి శనివారం రాత్రి ఊరికి చేరుకున్నారు. పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రియుడు సంఘటనా స్థలంలోనే చనిపోగా ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే 108 సాయంతో మహిళను హుజుర్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మ‌ృతుడిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.