కుటుంబ సభ్యులను తుపాకీతో కాల్చి.. ఆ తర్వాత..

| Edited By:

Aug 16, 2019 | 2:16 PM

కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటక చామరాజనగర్ జిల్లాకు చెందిన ఓంకార్ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీంతో మానసిక వ్యధకు గురైన ఓంకార్ కుటుంబ సభ్యులను మైసూరులోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. తన దగ్గర ఉన్న తుపాకీతో భార్య, కుమారుడు, తల్లి, దగ్గర బంధువైన వర్ష భట్టచార్యను కాల్చి చంపాడు. ఆ తరువాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న […]

కుటుంబ సభ్యులను తుపాకీతో కాల్చి.. ఆ తర్వాత..
Family Suicide
Follow us on

కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటక చామరాజనగర్ జిల్లాకు చెందిన ఓంకార్ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీంతో మానసిక వ్యధకు గురైన ఓంకార్ కుటుంబ సభ్యులను మైసూరులోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. తన దగ్గర ఉన్న తుపాకీతో భార్య, కుమారుడు, తల్లి, దగ్గర బంధువైన వర్ష భట్టచార్యను కాల్చి చంపాడు. ఆ తరువాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్డంకు తరలించారు. అప్పుల కారణంగానే వీరు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల విచారణలో తేలింది.