Andhra Pradesh: ఎదురొచ్చిన మృత్యువు.. ఐదుగురు మృతి.. అన్నప్రాశన వేడుక చేసుకుని వస్తుండగా

|

Jul 24, 2022 | 9:01 AM

కుమారుడు పుట్టాడన్న సంతోషం ఆ కుటుంబంలో ఎంతో కాలం నిలవలేదు. తమ గారాల పుత్రుడికి అన్నప్రాశన వేడుక చేసుకుని తిరిగి వస్తుండగా ఊహించని ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత (Accident) పడ్డారు. తల్లి, చిన్నారి తో పాటు....

Andhra Pradesh: ఎదురొచ్చిన మృత్యువు.. ఐదుగురు మృతి.. అన్నప్రాశన వేడుక చేసుకుని వస్తుండగా
Accident In Annamayya
Follow us on

కుమారుడు పుట్టాడన్న సంతోషం ఆ కుటుంబంలో ఎంతో కాలం నిలవలేదు. తమ గారాల పుత్రుడికి అన్నప్రాశన వేడుక చేసుకుని తిరిగి వస్తుండగా ఊహించని ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత (Accident) పడ్డారు. తల్లి, చిన్నారి తో పాటు సోదరి సైతం మృత్యువాత పడటం ఆ ఇంట తీవ్ర విషాదం నింపింది. కులాంతర వివాహం చేసుకున్న ఆ దంపతులకు ఎనిమిదేళ్ల కుమార్తెతో పాటు 3 నెలల క్రితమే కుమారుడు పుట్టాడు. ఆటో ప్రమాదం ఆ కుటుంబాన్ని కకావికలం చేసింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన కృష్ణారెడ్డి, పెంచలమ్మ దంపతులకు ఓ కుమాడు, కుమార్తె సంతానం. కుమారుడి అన్నప్రాశన వేడుక కోసం పెంచలమ్మ తన కుమార్తె, కుమారుడిని తీసుకుని ఆటోలో ఓబులవారిపల్లె పయనమైంది. కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఆటోలో రైల్వేకోడూరు బయల్దేరారు. మార్గమధ్యలో వేంగా వస్తున్న లారీ వీరి ఆటోను బలంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో పెంచలమ్మ కుమార్తె సాయి, కుమారుడు, తల్లి వెంకటసుబ్బమ్మ, వెంకట తులసమ్మ అక్కడికక్కడే మరణించారు. ఆటోడ్రైవర్ బాలకృష్ణ, పెంచలమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను 108లో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పెంచలమ్మ మృతి చెందింది. భార్యాపిల్లల మృతి విషయం తెలిసి ఆమె భర్త రోదించిన తీరు కంటతడి పెట్టించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..