AP Crime News: పెళ్లికి హాజరై ఇంటికి వస్తుండగా ఘోర ప్రమాదం.. తండ్రీకూతురు దుర్మరణం.. మరో నలుగురికి..

|

Aug 16, 2021 | 11:45 AM

Prakasam district Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తండ్రి, కుమార్తె

AP Crime News: పెళ్లికి హాజరై ఇంటికి వస్తుండగా ఘోర ప్రమాదం.. తండ్రీకూతురు దుర్మరణం.. మరో నలుగురికి..
Road Accident
Follow us on

Prakasam district Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తండ్రి, కుమార్తె దుర్మరణం చెందారు. ఈ విషాద సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మిట్టమీద పల్లె సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. సోమవారం ఉదయంలో హైవేపై లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తండ్రి, కుమార్తె శ్రీరాములు, మల్లికా అక్కడికక్కడే మృతి చెందారు.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గుంటూరు ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. బాధితులంతా మార్కాపురం మండలం కొండపల్లికి చెందిన వారిగా గుర్తించారు. అర్ధవీడులో జరిగిన పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మార్కాపురం పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Also Read:

Ramya Murder Case: దిశ కేసుల్లో ఏ ఒక్కరిని వదిలిపెట్టం.. 58 రోజల్లో శిక్ష పడేలా చూస్తాం.. హోంమంత్రి సుచరిత

AP Crime News: కసాయి భర్త.. మద్యానికి డబ్బు ఇవ్వలేదని దారుణం.. భార్య, కూతురిపై పెట్రోల్ పోసి..