Latest crime news: నర్సంపేటలో విషాద ఘటన.. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. ప్రమాదం ఎలా జరిగిందంటే..

Latest crime news: తెలంగాణలోని నర్సంపేట మండలం మహేశ్వరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ రైతు బలయ్యాడు. దీంతో ఆయన కుటుంబం

Latest crime news: నర్సంపేటలో విషాద ఘటన.. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. ప్రమాదం ఎలా జరిగిందంటే..
Follow us

|

Updated on: Jan 07, 2021 | 7:33 PM

Latest crime news: తెలంగాణలోని నర్సంపేట మండలం మహేశ్వరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ రైతు బలయ్యాడు. దీంతో ఆయన కుటుంబం దిక్కు తోచని స్థితిలో పడిపోయింది. బాధితుల కథనం ప్రకారం.. నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామానికి చెందిన ఉసిల్ల బయన్నఅనే రైతు తనకున్న వ్యవసాయ భూమి పనుల్లో భాగంగా ట్రాక్టర్ డ్రైవర్‌తో కల్టీవేటర్ కొట్టిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ వేణు ట్రాక్టర్‌ను వేగంగా నడపడంతో బయన్న ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుండి రొటవేటర్ మీద పడ్డాడు. దీంతో బయ్యన్నకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ వేణు గమనించే సరికే బయ్యన్న అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా మృతుడికి ముగ్గురు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నాడు. దీంతో ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి.

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అప్రమత్తమైన హైదరాబాద్ జూ పార్క్ అధికారులు.. పక్షుల సంరక్షణకు ప్రత్యేక రాపిడ్ యాక్షన్ ఫోర్స్