Black magic: క‌రోనా క‌ల్లోలంలోనూ క్షుద్రపూజలు.. ఆది, గురు వారాలు వచ్చాయంటే వణుకే

ఓవైపు కరోనా కల్లోలం.. మరోవైపు క్షుద్రపూజల కలకలం. వెరసి పెద్దపల్లి జిల్లా వాసులకు కంటిమీద కునుకు రావడం లేదు. సుల్తానాబాద్‌....

Black magic: క‌రోనా క‌ల్లోలంలోనూ క్షుద్రపూజలు.. ఆది, గురు వారాలు వచ్చాయంటే వణుకే
black-magic

Updated on: Jul 29, 2021 | 9:58 AM

ఓవైపు కరోనా కల్లోలం.. మరోవైపు క్షుద్రపూజల కలకలం. వెరసి పెద్దపల్లి జిల్లా వాసులకు కంటిమీద కునుకు రావడం లేదు. సుల్తానాబాద్‌ శివారులో రోజూ ఏదో ఓచోట క్షుద్రపూజల కలకలం రేగుతోంది. దీంతో జనం వణికిపోతున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు జనం బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. తాజాగా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్‌లో క్షుద్రపూజలు టెన్షన్ రేపాయి. గ్రామంలో రాత్రయితే చాలు రోడ్లపై నిమ్మకాయలు, కోడిగుడ్డు, అన్నం ముద్దలు, పసుపు, కుంకుమతో కూడిన వస్తువులు నాలుగురోడ్ల కూడలిలో దర్శనమిస్తున్నాయి. గ్రామంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. అమావాస్య, ఆది, గురు వారాలు వచ్చాయంటే చాలు గ్రామంలో క్షుద్రపూజలు చేస్తున్నారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.  ప్రపంచం మొత్తం శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతుంది. కొందరు ఇంకా మూఢనమ్మకాలతో పాతాళ లోకానికి చేరుతున్నారు. విద్యావంతులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ తాంత్రిక పూజల హడావిడి తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తుంది.

ఏది ఏమైనా కరోనాకు మందు కనిపెడుతున్న ఈ రోజుల్లో ఇంకా మూఢ నమ్మకాల ఊబిలో ప్రజలు మునిగిపోతున్నారు. క్షుద్ర పూజలు చేస్తున్న వారిని పట్టుకుని, కేసు నమోదు చేయాలని, మూఢనమ్మకాలు, క్షుద్రపూజలపై అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. లేదా రోడ్లు కలిసే కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు పెట్టి ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ల ఆట కట్టించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: జంబో ‘పనస’.. వెయిట్ ఎంతో తెలిస్తే షాకవుతారు

పశ్చిమ గోదావరి జిల్లా విద్యార్థి హత్య కేసులో ఊహించని కోణం.. స్వలింగ సంపర్కమే కారణం

Loading...
Unable to load recommendations.
Follow Us