ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారులకు డిప్యూటేషన్.. జేపీ నడ్డా కారుపై దాడి ఘటనే కారణమా..?

పశ్చిమబెంగాల్‌ పోలీసులపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. కోల్‌కతాలో ఓ బహిరంగ సభకు హాజరుకావడానికి

ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారులకు డిప్యూటేషన్.. జేపీ నడ్డా కారుపై దాడి ఘటనే కారణమా..?

Updated on: Dec 13, 2020 | 8:18 AM

పశ్చిమబెంగాల్‌ పోలీసులపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. కోల్‌కతాలో ఓ బహిరంగ సభకు హాజరుకావడానికి వెళ్లిన బీజేపీ జాతీయ అధ్యక్షుడ జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేయడానికి ఆ రాష్ట్ర సీఎస్, డీజీపీలను కేంద్ర హోం శాఖ సమావేశాలకు రావాలని సమన్లు జారీ చేసింది. కానీ వారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశాల మేరకు దాడికి సంబంధించి వివరణ రాసి పంపించారు. దీంతో కేంద్ర హోం శాఖ పశ్చిమబెంగాల్ పోలీస్ శాఖపై సీరియస్‌గా ఉంది. వెంటనే ముగ్గురు అధికారులను డిప్యూటేషన్‌పై సెంట్రల్‌కు రావాలని ఆదేశాలు జారీ చేసింది.

జేపీ నడ్డా పర్యటనకు సంబంధించి భద్రత కల్పించడంలో విఫలమైనందుకు పశ్చిమబెంగాల్ క్యాడర్‌లో విధులు నిర్వహిస్తున్న డైమండ్ హార్బర్ ఎస్పీ భోల్‌నాథ్ పాండే, ప్రెసిడెన్సీ రేంజ్ డీఐజీ ప్రవీణ్ త్రిపాఠి, దక్షణ బెంగాల్ అదనపు డీజీ రాజీవ్ మిశ్రాలను కేంద్రంలో పనిచేయాలని డిప్యూటేషన్ జారీ చేసింది. నిబంధనల ప్రకారమే అధికారులను కేంద్రానికి బదిలీ చేశామని కేంద్ర హోం శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ అఖిల భారత సర్వీసు అధికారులను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కావాలని రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా అధికారులను డిప్యూటేషన్ చేశారు. దీంతో హోం శాఖ ఆదేశాలను పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అంతేకాకుండా రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి విధించాలని హోం మంత్రి అమిత్‌ షా ప్రయత్నిస్తున్నారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.