Crime News: చపాతీలు చేయనన్నందుకు యువకుడి హత్య.. దారుణంగా గొంతుకోసి..

|

Nov 30, 2021 | 9:27 AM

Murder: రోజురోజూకు నేరాలు పెరిగిపోతున్నాయి. కొంతమంది చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంతో హత్యలు చేయడం వరకు వెళ్లిపోతున్నారు. తాజాగా రాజస్తాన్

Crime News: చపాతీలు చేయనన్నందుకు యువకుడి హత్య.. దారుణంగా గొంతుకోసి..
Murder
Follow us on

Murder: రోజురోజూకు నేరాలు పెరిగిపోతున్నాయి. కొంతమంది చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంతో హత్యలు చేయడం వరకు వెళ్లిపోతున్నారు. తాజాగా రాజస్తాన్ లోని జైపూర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. చపాతీ చేయలేదన్న కారణంతో ముగ్గురు వ్యక్తులు కలిసి యువకుడిని దారుణంగా గొంతుకోసి చంపారు. వంట విషయంలో నలుగురు కూలీల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. అల్వార్ జిల్లాకు చెందిన జై నారాయణ్ మీనా (27) అనే వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు శుక్రవారం గొంతు కోసి చంపినట్లు డిసిపి రిచా తోమర్ తెలిపారు.

ఆల్వార్ నివాసితులైన సంతోష్ మీనా, లీలా రామ్ మీనా, గంగా లహేరి, హతుడు జై ప్రకాశ్‌ నారాయణ(27) విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలోని స్టీల్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పని చేస్తున్నారు. వీరంతా ఐస్ ఫ్యాక్టరీకి సమీపంలో ఒక ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. అయితే శుక్రవారం రాత్రి వారి మధ్య వంట విషయంలో గొడవ జరగింది. అయితే చపాతీలు చేయాలని మిగతా ముగ్గురు జై ప్రకాశ్‌నారాయణ్ అనే వ్యక్తిని పురమాయించారు. అయితే.. అతను చపాతీలను చేయనని చెప్పడంతో మిగతా ముగ్గురు అతన్ని చంపాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో జై నారాయణ్ బాత్‌రూమ్‌కి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అడ్డగించి.. కొట్టి, గొంతుకోసి చంపేశారు. ఆ తర్వాత ఆ ముగ్గురు బాధితుడిని వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారంతో అక్కడికి చేరుకున్న జైపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం రూమ్‌లో ఉన్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తామె చంపినట్లు వెల్లడించారని పోలీసులు తెలిపారు. అనంతరం వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Kevin Pietersen: అందుకే భారత్ అత్యంత అద్భుతమైన దేశం.. ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తిన ఇంగ్లాండ్ క్రికెటర్..

Hyderabad: బంగారం అక్రమ రవాణా.. హైదరాబాద్ నగల వ్యాపారిని అరెస్టు చేసిన ఈడీ