కోవిడ్-19 ఎఫెక్ట్…అసెంబ్లీ ఉపఎన్నికల వాయిదా

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దాదాపు 12 లక్షలకు చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు  జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 కారణంగా వీటిని నిర్వహించే పరిస్థితిలో..

కోవిడ్-19 ఎఫెక్ట్...అసెంబ్లీ ఉపఎన్నికల వాయిదా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 23, 2020 | 1:01 PM

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దాదాపు 12 లక్షలకు చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు  జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 కారణంగా వీటిని నిర్వహించే పరిస్థితిలో లేమని ఆయా  రాష్ట్రాలు విన్నవించుకున్నాయి.  ముఖ్యంగా మధ్యప్రదేశ్ లో ఖాళీ అయిన 24 అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా, ఇద్దరు సభ్యుల మృతితో ఈ నియోజకవర్గాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు కూడా ఈ ఉప ఎన్నికలు అగ్నిపరీక్షే.. అయితే కరోనా వైరస్ పరిస్థితి కారణంగా ఈ రాష్ట్రంతో బాటు వివిధ రాష్ట్రాల్లో ఆయా అసెంబ్లీ ఉప ఎన్నికలను వాయిదా వేయవలసిన పరిస్థితి నెలకొంది.  ఈ దృష్ట్యా పలు రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఈ నెల 31 లోగా పంపాలని ఈసీ కోరింది. బీహార్ లో  మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఇందుకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు ప్రారంభించినప్పటికీ పలు విపక్ష పార్టీలు…. వీటిని ఈసీ వాయిదా వేయవచ్ఛునని భావిస్తున్నాయి.