రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు వ్యక్తలకు కరోనా పాజిటివ్ వచ్చింది. బాధితులిద్దరూ గత మార్చి నెలలో ఢిల్లీ నిజాముద్దీన్లోని మర్కజ్ తబ్లీఘీ జమాత్ సమావేశాలకు హజరైనట్లు తెలుస్తోంది. వీరిద్దరినీ మార్చి 31వ తేదీ నుంచి వైద్యులు పర్యవేక్షణలో ఉంచారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు ఐసోషన్ వార్డులోనే ఉంటున్నారు. అయితే తాజాగా కరోనా పరీక్షలు జరపగా.. పాజిటివ్గా వచ్చింది. దీంతో వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఇప్పటికే 10వ తేదీన కూడా ఓ యువకుడికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ రావడంతో కలకలం రేగింది.
మరోవైపు రాష్ట్రంలో క్రమక్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏడువందలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 18మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పాజిటివ్ కేసుల్లో ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉండటంతో.. ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగా కఠిన చర్యలు తీసుకుంటోంది.