రేపు టీటీడీ బోర్డు అత్యవసర భేటీ..శ్రీవారి దర్శనాలపై..!

|

Jul 03, 2020 | 1:19 PM

లాక్‌డౌన్ 1.0లో జూన్‌11 నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నారు. 6 వేల మందితో ప్రారంభించిన స్వామివారి దర్శనాల సంఖ్య ప్రస్తుతం 10వేలు దాటింది. మరోవైపు కరోనా విజృంభిస్తోంది..ఈ నేపథ్యంలోనే రేపు టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనుంది..

రేపు టీటీడీ బోర్డు అత్యవసర భేటీ..శ్రీవారి దర్శనాలపై..!
Follow us on

లాక్‌డౌన్ అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం మళ్లీ భక్తులతో కలకలలాడుతోంది. కరోనా వైరస్ కారణంగా దాదాపు 80 రోజులకు పైగా భక్తుల దర్శనాలను నిలిపివేసిన అధికారులు లాక్‌డౌన్ 1.0తో తిరిగి శ్రీవారి దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. మరోవైపు లాక్‌డౌన్ 2.0 మొదలైంది. ఈ నేపథ్యంలోనే రేపు(శనివారం జూలై4న) టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి.. శ్రీవారి దర్శన విధి విధానాలపై పాలక మండలిలో చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావంతో మార్చిలో రద్దయిన దర్శనాలను జూన్‌11 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. 6 వేల మందితో ప్రారంభించిన శ్రీవారి దర్శనాల సంఖ్య ప్రస్తుతం 12 వేలకు పైగా చేరుకుంది. మరోవైపు రోజురోజుకు కరోనా కేసులు కూడా పెరుగుతున్న క్రమంలో తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ ధర్మకర్తల మండలి చర్చించనున్నట్లు సమాచారం.