వర్చువల్‌ మహానాడు…అంతా ‘జూమ్‌’ లోనే…

మహానాడు.. టీడీపీకి పెద్ద పండుగ ఇది. ఏటా రెండు మూడు రోజులపాటు అత్యంతకోలాహలంగా నిర్వహిస్తారు. అయితే ఈసారి కరోనా వ్యాప్తి దృష్ట్యా... ఈసారి మహానాడును ఈసారి రెండు రోజులకే కుదించారు.

వర్చువల్‌ మహానాడు...అంతా ‘జూమ్‌’ లోనే...

Updated on: May 27, 2020 | 12:44 PM

మహానాడు.. టీడీపీకి పెద్ద పండుగ ఇది. ఏటా రెండు మూడు రోజులపాటు అత్యంతకోలాహలంగా నిర్వహిస్తారు. అయితే ఈసారి కరోనా వ్యాప్తి దృష్ట్యా… ఈసారి మహానాడును రెండు రోజులకే కుదించారు. పార్టీ చరిత్రలో తొలిసారిగా ‘వర్చువల్‌ మహానాడు’ జరుగుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లోని పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగానికి చెందిన నాయకులు, కార్యకర్తలు సుమారు 14 వేల మంది జూమ్‌ యాప్‌ ద్వారా ఇందులో పాల్గొంటున్నారు.

యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా మరో 10 వేల మంది కార్యక్రమాన్ని చూసేలా ఏర్పాట్లు చేశారు. ఒక రాజకీయ పార్టీ… ఇన్ని వేల మంది నాయకుల్ని, కార్యకర్తల్ని భాగస్వాముల్ని చేస్తూ ఆన్‌లైన్‌లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి.

మే 28న ఎన్టీఆర్‌ జయంతి కలసి వచ్చేలా, ఏటా మూడు రోజులపాటు అత్యంత కోలాహలంగా మహానాడు నిర్వహించడం ఆనవాయితీ. కరోనా వల్ల ఈసారి… పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి ఇళ్ల నుంచే మహానాడులో పాల్గొంటున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ ఆంధ్రప్రదేశ్‌ విభాగం అధ్యక్షుడు కళావెంకటరావు సహా, కొందరు పొలిట్‌బ్యూరో సభ్యులు, ముఖ్య నేతలు మాత్రం మంగళగిరి సమీపంలోని పార్టీ జాతీయ కార్యాలయం నుంచి ‘మహానాడు’లో పాల్గొంటారు. మిగిలిన నేతలంతా జూమ్‌ యాప్‌ ద్వారా భాగస్వాములవుతారు.