పీఎకు కరోనా…క్వారంటైన్‌లోకి భోజ్‌పురి సూపర్‌స్టార్!

భోజ్‌పురి సూపర్‌స్టార్, బీజేపీ ఎంపీ రవికిషన్ పీఏకు క‌రోనా సోకింది. దీంతో తాను కూడా క్వారంటైన్‌లోకి వెళ్లిన్నట్లు స్వయంగా అతనే ప్రకటించారు. త‌న ద‌గ్గ‌ర ప‌ని చేస్తున్న..

పీఎకు కరోనా...క్వారంటైన్‌లోకి భోజ్‌పురి సూపర్‌స్టార్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 14, 2020 | 4:21 PM

భోజ్‌పురి సూపర్‌స్టార్, బీజేపీ ఎంపీ రవికిషన్ పీఏకు క‌రోనా సోకింది. దీంతో తాను కూడా క్వారంటైన్‌లోకి వెళ్లిన్నట్లు స్వయంగా అతనే ప్రకటించారు. త‌న ద‌గ్గ‌ర ప‌ని చేస్తున్న 42 ఏళ్ల గుడ్డూ పాండే కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారని భోజ్‌పురి సూపర్‌స్టార్, బీజేపీ ఎంపీ ర‌వికిష‌న్ తెలిపారు. వైద్య పరీక్ష‌లు చేయ‌గా, అత‌నికి క‌రోనా పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. దీంతో అత‌ని‌ని ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్యం అందిస్తున్నారు.

కరోనా బారినపడ్డ తన పీఏ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నానని రవికిషన్ తెలిపారు. అయితే పాండేకి కరోనా సోకింద‌నే విష‌యం తెలిసిన వెంట‌నే ర‌వికిష‌న్‌తో పాటు అత‌నితో కాంటాక్ట్ అయిన వాళ్లు కూడా టెస్ట్‌లు చేయించుకున్నారని తెలిపారు. ముందస్తుగానే…క్వారంటైన్‌కి వెళ్ళారు. గోరఖ్‌పూర్‌లో కరోనా వ్యాప్తి శరవేగంగా ఉందని,..ఇక్కడి ప్ర‌జ‌లంతా తప్పక మాస్కులు ధ‌రించాల‌ని, బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. కరోనా సంక్షోభంలో స్వీయ జాగ్రత్తలు మాత్ర‌మే మ‌న‌కి ర‌క్ష‌ణ అని రవికిషన్ వెల్లడించారు.