ఎంఐఎం చీఫ్‌కు కరోనా పరీక్ష.. రిజల్ట్స్ కూడా వచ్చేశాయి..

మజ్లీస్ పార్టీ చీఫ్,హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. నగరంలో కరోనా కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఆంటీజెన్, ఆర్టీపీసీఆర్‌ టెస్టులు వేగంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే..

ఎంఐఎం చీఫ్‌కు కరోనా పరీక్ష.. రిజల్ట్స్ కూడా వచ్చేశాయి..

Updated on: Jul 11, 2020 | 2:46 PM

మజ్లీస్ పార్టీ చీఫ్,హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. నగరంలో కరోనా కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఆంటీజెన్, ఆర్టీపీసీఆర్‌ టెస్టులు వేగంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో కరోనా సెంటర్లలో ఉన్న వసతులు, పరీక్ష విధానాన్ని ఎంపీ అసదుద్దీన్ పర్యవేక్షించారు. ఈ క్రమంలో పాతబస్తీలోని నిజామియీ జనరల్ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ప్రజల్లో అవగాహన వచ్చేందుకు ఈ పరీక్షలు చేయించుకున్నట్లు ఎంపీ పీఆర్వో తెలిపారు. పాతబస్తీలో దాదాపు 30 సెంటర్లలో ఈ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని.. కరోనా లక్షణాలు కన్పిస్తే వెంటనే వచ్చి పరీక్షలు చేయించుకోవాలని అసదుద్దీన్ ప్రజలను కోరారు. పరీక్షలు చేయించుకునేందుకు భయపడకూడదన్నారు. కాగా, తనకు కరోనా పరీక్షల్లో దేవుడి దయ వల్ల నెగిటివ్ వచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us