మజ్లీస్ పార్టీ చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. నగరంలో కరోనా కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఆంటీజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులు వేగంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో కరోనా సెంటర్లలో ఉన్న వసతులు, పరీక్ష విధానాన్ని ఎంపీ అసదుద్దీన్ పర్యవేక్షించారు. ఈ క్రమంలో పాతబస్తీలోని నిజామియీ జనరల్ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ప్రజల్లో అవగాహన వచ్చేందుకు ఈ పరీక్షలు చేయించుకున్నట్లు ఎంపీ పీఆర్వో తెలిపారు. పాతబస్తీలో దాదాపు 30 సెంటర్లలో ఈ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని.. కరోనా లక్షణాలు కన్పిస్తే వెంటనే వచ్చి పరీక్షలు చేయించుకోవాలని అసదుద్దీన్ ప్రజలను కోరారు. పరీక్షలు చేయించుకునేందుకు భయపడకూడదన్నారు. కాగా, తనకు కరోనా పరీక్షల్లో దేవుడి దయ వల్ల నెగిటివ్ వచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Got my antigen & RTPCR tests done for COVID-19 today. My antigen test results were negative, Alhamdulilah. There are 30 odd centres in the South of Hyderabad where antigen testing is being conducted, I encourage all of you to not hesitate & get tested! pic.twitter.com/lihGjG7upx
— Asaduddin Owaisi (@asadowaisi) July 11, 2020