‘మాస్క్ పరోటాలు కావాలా నాయనా’? ఛలో మదురై !

| Edited By: Pardhasaradhi Peri

Jul 09, 2020 | 3:36 PM

తమిళనాడు లోని  మదురైలో గల ఓ రెస్టారెంట్ కి మెల్లగా డిమాండ్ పెరుగుతోంది.  అక్కడికి జనాలు పరుగులు తీయడం ప్రారంభమైంది. మరేం లేదు ! ఈ కరోనా కాలంలోఇక్కడ మాస్కుల రూపంలో..

మాస్క్ పరోటాలు కావాలా నాయనా? ఛలో మదురై !
Follow us on

తమిళనాడు లోని  మదురైలో గల ఓ రెస్టారెంట్ కి మెల్లగా డిమాండ్ పెరుగుతోంది.  అక్కడికి జనాలు పరుగులు తీయడం ప్రారంభమైంది. మరేం లేదు ! ఈ కరోనా కాలంలోఇక్కడ మాస్కుల రూపంలో పరోటాలు తయారు చేసి సర్వ్ చేస్తున్నారు. అచ్ఛు మాస్కుల షేపులో వీటిని తయారు చేయడం ఫేస్ మాస్కుల వినియోగాన్ని పెంచడానికేనని ఈ రెస్టారెంట్ యాజమాన్యం అంటోంది. ఇక్కడి ప్రజలకు మాస్కుల గురించి పెద్దగా తెలియదని, అందువల్ల వారిలో అవగాహన కల్గించేందుకే ఇలా వెరైటీగా వీటి తయారీ ప్రారంభించామని దీని యజమానులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఇవి హాట్ ఫేవరేట్ గా మారిపోయాయి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 30 శాతం మంది ప్రజలకు ఫేస్ మాస్కులపై అవగాహనా లేదు. వాళ్ళు వీటిని ధరించడం లేదు. అందువల్లే తామీ కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టామని ఈ రెస్టారెంట్ యజమానులు అంటున్నారు.