Rajesh Tope: మహారాష్ట్రలో కరోనా భీభత్సం.. ఆరోగ్య మంత్రి రాజేష్ తోపేకూ పాజిటివ్..
Rajesh Tope -Covid-19 positive: మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం రాష్ట్రంలో ఆంక్షలు విధించింది. తాజాగా ఐదువేలకు పైగా మందికి కరోనా నిర్థారణ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా..
Rajesh Tope -Covid-19 positive: మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం రాష్ట్రంలో ఆంక్షలు విధించింది. తాజాగా ఐదువేలకు పైగా మందికి కరోనా నిర్థారణ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే కూడా కరోనా బారిన పడ్డారు. కరోనావైరస్ పరీక్ష చేయించుకోగా తనకు పాజిటివ్గా నిర్థారణ అయిందని రాజేష్ తోపే గురువారం రాత్రి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు.
కరోనా పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం ఆరోగ్యవంతంగా ఉన్నానని.. వైద్యులను సంప్రదిస్తున్నానని రాజేష్ తోపే తెలిపారు. అందరి ఆశీస్సులతో కరోనా ఓడించి త్వరలో మీ ముందుకు సేవ చేసేందుకు వస్తానంటూ పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని.. లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలని ఆయన సూచించారు.
माझी कोरोना चाचणी पॉझिटिव्ह आली आहे. माझी प्रकृती चांगली असून मी डॉक्टरांचा सल्ला घेत आहे. आपल्या सर्वांच्या आशीर्वादाने कोरोनाला हरवून लवकरच मी आपल्या सेवेत रुजू होईल. माझ्या संपर्कात आलेल्यांनी काळजी घ्यावी आणि लक्षणे दिसल्यास तत्काळ आपली कोरोना चाचणी करून घ्यावी.
— Rajesh Tope (@rajeshtope11) February 18, 2021
Also Read: