ఢిల్లీ.. మాకు ఆర్మీ డాక్టర్లు కావాలి.. సీఎం అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీలో అతి పెద్ద కోవిడ్-19 సెంటర్ లో పని చేసేందుకు తమకు ఆర్మీ డాక్టర్లు కావాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ముఖ్యంగా ఆర్మీతో బాటు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు శాఖలో పని చేసే అనుభవజ్ఞులైన హెల్త్ వర్కర్లు కూడా ఆవసరమని ఆయన అన్నారు. 10 వేల పడకలతో..

ఢిల్లీ.. మాకు ఆర్మీ డాక్టర్లు కావాలి.. సీఎం అరవింద్ కేజ్రీవాల్

Edited By:

Updated on: Jun 23, 2020 | 8:13 PM

ఢిల్లీలో అతి పెద్ద కోవిడ్-19 సెంటర్ లో పని చేసేందుకు తమకు ఆర్మీ డాక్టర్లు కావాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ముఖ్యంగా ఆర్మీతో బాటు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు శాఖలో పని చేసే అనుభవజ్ఞులైన హెల్త్ వర్కర్లు కూడా ఆవసరమని ఆయన అన్నారు. 10 వేల పడకలతో ఈ పెద్ద కోవిడ్ కేంద్రం ఈ నెల 26 న ప్రారంభం కావచ్ఛునని భావిస్తున్నారు. కేజ్రీవాల్ అభ్యర్థనపై స్పందించిన హోమ్ మంత్రి అమిత్ షా.. ట్వీట్ చేస్తూ .. ఈ కేంద్రానికి సంబంధించిన పనులు చాలావరకు పూర్తి అయ్యాయని, ఈ నెల 26 కల్లా ఇందులో చాలా భాగం పని చేయడం ప్రారంభించవచ్చునన్నారు. ఇక సైనిక డాక్టర్ల నియామకం గురించి ఆలోచిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us