అరె ! లాక్ డౌన్ ఎఫెక్ట్ ! ‘యమున’ ఎలా స్వఛ్చంగా మారిపోయిందో ? ‘

| Edited By: Pardhasaradhi Peri

May 26, 2020 | 12:10 PM

దేశంలో రెండు నెలలపాటు కొనసాగిన లాక్ డౌన్ 'అద్భుతమైన పని' కూడా చేసింది. ఢిల్లీలో పాతికేళ్లుగా అధికారంలోకి వఛ్చిన ప్రభుత్వాలు 5 వేల కోట్లకు పైగా వ్యయం చేసినా....

అరె ! లాక్ డౌన్ ఎఫెక్ట్ ! యమున ఎలా స్వఛ్చంగా  మారిపోయిందో ?
Follow us on

దేశంలో రెండు నెలలపాటు కొనసాగిన లాక్ డౌన్ ‘అద్భుతమైన పని’ కూడా చేసింది. ఢిల్లీలో పాతికేళ్లుగా అధికారంలోకి వఛ్చిన ప్రభుత్వాలు 5 వేల కోట్లకు పైగా వ్యయం చేసినా….  చేయలేకపోయిన పనిని లాక్ డౌన్ చేసింది. యమునా నదిని శుద్ది చేసేసింది. ఇప్పుడిది జలజలా స్వచ్ఛంగా పారుతోంది. పారిశ్రామిక వ్యర్థాలు లేవు.. వాహన కాలుష్యం అంతకన్నా లేదు. రెండు నెలలుగా ఈ ‘చీడపీడలు’ లేకపోవడంతో ఈ నది నీరు దానికదే శుద్ది అయిపోయింది. ఈ కాలుష్యరహిత జలాల్లో గ్రే హెరాన్, ఐబిస్ వంటి వలస పక్షులు చేపల కోసం స్వేఛ్చగా వేటాడుతున్నాయి. జలాల్లో ఈదుతున్నాయి. తాను 22 ఏళ్ళుగా యమునా శుద్ది కార్యాచరణ ప్రణాళికా బృందంలో సభ్యుడినని, కానీ ఇంత పరిశుద్ధంగా ఈ నది నీటిని ఎన్నడూ చూడలేదని డాక్టర్ రాజీవ్ చౌహాన్ అనే కన్సర్వేషన్ ఆఫీసర్ తెలిపారు. నదులపై లాక్ డౌన్ ప్రభావం ఇంతగా ఉంటుందా అని ఆశ్చర్యపోయారాయన. ఏళ్ళ తరబడి యమునా నదిపై అధ్యయనం చేస్తున్న వైల్డ్ లైఫ్ ఇండియా-డెహ్రాడూన్ ప్రాజెక్ట్ సభ్యుడు కూడా అయిన రాజీవ్ చౌహాన్.. ఈ అద్భుతం నిజంగా మరువలేనిదని అభివర్ణించారు. 1400 కి.మీ. పొడవునా ఏడు రాష్ట్రాల గుండా యమునా నది ప్రవహిస్తోంది. ఈ నది 33 శాతం శుద్ది అయిందని ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ కూడా అంగీకరించింది.