Coronavirus: పారాసిటమాల్ వాడానన్న హాలీవుడ్ నటి..!

| Edited By:

Mar 21, 2020 | 11:38 AM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు మందు కనుగునే పనిలో శాస్త్రవేత్తలు నిమఙ్ఞమై ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ మహమ్మారి ఆట కట్టించాలని వారంతా కంకణం కట్టుకున్నారు

Coronavirus: పారాసిటమాల్ వాడానన్న హాలీవుడ్ నటి..!
Follow us on

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు మందు కనుగునే పనిలో శాస్త్రవేత్తలు నిమఙ్ఞమై ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ మహమ్మారి ఆట కట్టించాలని వారంతా కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రయోగాలు చేయడంలో వారు వేగాన్ని పెంచారు. మరోవైపు మలేరియా, హెచ్‌ఐవీ మందులు కరోనాకు పనిచేస్తున్నట్లు కొంతమంది వైద్యులు చెబుతున్నారు. కరోనా బాధితులలో పలువురికి ఈ మందులు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయని వారు నిర్ధారించారు. కాగా కరోనా లక్షణాల్లో జ్వరం ఒకటి కాగా.. దాన్ని కంట్రోల్ చేసేందుకు పారాసిటమాల్ బాగా పనిచేస్తుందని హాలీవుడ్ నటి, జేమ్స్‌బాండ్ గర్ల్ ఓల్గా కురిలెంకో చెబుతున్నారు. ఇటీవలే తనకు కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించిన ఆమె.. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో తాను ఎలా కోలుకున్నానో కూడా ఆమె వెల్లడించారు. ఒకవేళ జ్వరం ఎక్కువ అవుతూ ఉంటే, అలాగే నొప్పి అధికంగా ఉంటే పారాసిటమాల్ తీసుకోవాలని సూచించారని.. తాను వాటినే తీసుకున్నట్లు ఆమె అన్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటే కరోనాను జయించొచ్చని.. ఆ శక్తిని పెంచుకోవడం కోసం తాను B5,విటమిన్‌ C,విటమిన్ E, జింక్ టాబ్లెట్‌లను వేసుకున్నట్లు ఓల్గా తెలిపారు. అయితే ఈ విటమిన్లు కరోనాను క్యూర్ చేయవని.. కేవలం రోగ నిరోధక శక్తిని మాత్రమే పెంచుతాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన జ్వరం పోయిందని.. కానీ మిగిలిన లక్షణాలు తగ్గడానికి కాస్త సమయం పట్టొచ్చని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఓల్గాకి కరోనా పాజిటివ్ అని తేలగానే.. ఆమె బోయ్ ఫ్రెండ్ బెన్ క్యూరా తనతో బ్రేకప్ చెప్పేశాడన్న ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది.

 

Read This Story Also: చీటింగ్ కేసుః హైదరాబాద్‌లో ప్రముఖ వ్యక్తి ఇంటిపై పోలీసుల దాడులు