సోనూసూద్ ఉదారత.. వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా 10 బస్సులు

| Edited By:

May 12, 2020 | 5:21 PM

ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఇదివరకే కరోనా నేపథ్యంలో పంజాబ్‌లోని వైద్యులకు 1500 వ్యక్తిగత సంరక్షణ కిట్లను అందించాడు. అలాగే జుహూలోని తన హోటల్స్‌ని వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు..

సోనూసూద్ ఉదారత.. వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా 10 బస్సులు
Follow us on

ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఇదివరకే కరోనా నేపథ్యంలో పంజాబ్‌లోని వైద్యులకు 1500 వ్యక్తిగత సంరక్షణ కిట్లను అందించాడు. అలాగే జుహూలోని తన హోటల్స్‌ని వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు వసతికి ఉపయోగించేందుకు ముందుకొచ్చాడు. కాగా ఇప్పుడు మరోసారి.. వలస కార్మికులని స్వస్థలాలకు తరలించడం కోసం ప్రత్యేకంగా పది బస్సులు ఏర్పాటు చేశాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక చిక్కుకున్న వసల కార్మికులను.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకుని రవాణా సౌకర్యం కల్పించాడు. సోమవారం ఈ బస్సులు థానే, గుల్బర్గా నుంచి బయలు దేరాయి. ఈ సందదర్భంగా సోనూసూద్ బస్టాపుల వద్దకు వెళ్లి.. వలస కార్మికులకు గుడ్‌బై చెప్పాడు.

ఈ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం ఒకే సమస్యతో బాధపడుతున్న ఈ తరుణంలో ప్రతీ భారతీయుడు తన కుటుంబంతో, ఇష్టమైన వారితో కలిసి ఉంటేనే పోరాడగలదనేది నా నమ్మకం. అందుకే ఇలా రోడ్లపై ఇబ్బంది పడుతున్న కార్మికుల్ని వారి స్వస్థలాలకు తరలించేందుకు నేను మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలతో మాట్లాడాను. ఇందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించాయి. 10 బస్సుల్లో వారు ప్రయాణిస్తున్నారు. పిల్లలు, వృద్ధులతో కూడిన వలస కార్మికుల్ని రోడ్లపై చూసి నా హృదయం ద్రవించింది. అందుకే ఈ రెండు రాష్ట్రాల్లోనే కాదు.. మిగిలిన రాష్ట్రాల్లోనూ వలస కార్మికులకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు సోనూ. కాగా ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్లుగా వైరల్ అవుతోంది.

Read More:

బ్రేకింగ్ న్యూస్: ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ కీలక ప్రసంగం

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. టెన్త్ విద్యార్థులకు వాట్సాప్‌ లెసన్స్

పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

వావ్ వాటే టెక్నాలజీ.. వాట్సాప్‌లో ఒకేసారి 50 మందితో వీడియో కాల్!