కరోనా కాటుతో డీడీ న్యూస్‌ వీడియో జర్నలిస్ట్‌ మృతి..

| Edited By:

May 29, 2020 | 12:12 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే లక్షా అరవై వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక మృతుల సంఖ్య నాలుగు వేలకు పైగా చేరుకుంది. ఇక గత కొద్ది రోజులుగా.. పోలీసులకు, జర్నలిస్టులకు, రాజకీయా నాయకులకు కూడా కరోనా సోకుతుండటం.. కలకలం రేపుతోంది. తాజాగా ఢిల్లీలోని దూరదర్శన్‌ న్యూస్‌ ఛానెల్‌కు చెందిన ఓ వీడియో జర్నలిస్టు కూడా కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లోనే ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలడంతో.. కుటుంబ సభ్యులు […]

కరోనా కాటుతో డీడీ న్యూస్‌ వీడియో జర్నలిస్ట్‌ మృతి..
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే లక్షా అరవై వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక మృతుల సంఖ్య నాలుగు వేలకు పైగా చేరుకుంది. ఇక గత కొద్ది రోజులుగా.. పోలీసులకు, జర్నలిస్టులకు, రాజకీయా నాయకులకు కూడా కరోనా సోకుతుండటం.. కలకలం రేపుతోంది. తాజాగా ఢిల్లీలోని దూరదర్శన్‌ న్యూస్‌ ఛానెల్‌కు చెందిన ఓ వీడియో జర్నలిస్టు కూడా కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లోనే ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలడంతో.. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు. అయితే వీడియో జర్నలిస్టు మృతదేహానికి కరోనా పరీక్షలు జరపగా.. అతడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో డీడీ న్యూస్‌ కెమెరా విభాగంలో పనిచేస్తోన్న సిబ్బందిని స్థానిక ఆస్పత్రికి తరలించి కరోనా పరీక్షలు చేపడుతున్నారు. అంతేకాదు.. డీడీ న్యూస్‌ స్టూడియోను తాత్కాలికంగా
మూసివేసి.. పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు మృతిపట్ల దూరదర్శన్ ఉద్యోగులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.