వుహన్‌లో మరోసారి అలజడి.. గాలిలో కరోనా జాడలు..

|

May 02, 2020 | 8:51 PM

కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని ఈ మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతోంది. ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తి గురించి ఇప్పటివరకు అనేక వార్తలు సోషల్ మీడియాలో హాల్‌చల్‌ చేశాయి. కొందరు గాలి ద్వారా వ్యాపిస్తుందని అంటే.. మరికొందరు ప్రత్యక్ష తాకిడితోనే వస్తుందని చెప్పారు. ఇలాంటి తరుణంలో కరోనా పుట్టినిల్లు వుహన్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. అక్కడ స్థానికంగా ఉండే ఆసుపత్రుల్లో ఇప్పటికీ కూడా కరోనా వైరస్ జాడలు ఉన్నట్లు […]

వుహన్‌లో మరోసారి అలజడి.. గాలిలో కరోనా జాడలు..
Follow us on

కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని ఈ మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతోంది. ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తి గురించి ఇప్పటివరకు అనేక వార్తలు సోషల్ మీడియాలో హాల్‌చల్‌ చేశాయి. కొందరు గాలి ద్వారా వ్యాపిస్తుందని అంటే.. మరికొందరు ప్రత్యక్ష తాకిడితోనే వస్తుందని చెప్పారు. ఇలాంటి తరుణంలో కరోనా పుట్టినిల్లు వుహన్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి.

అక్కడ స్థానికంగా ఉండే ఆసుపత్రుల్లో ఇప్పటికీ కూడా కరోనా వైరస్ జాడలు ఉన్నట్లు గుర్తించారు. వుహన్ నగరంలోని రెండు ఆసుపత్రుల గాలిలోని తుంపర్లలో కరోనాను గుర్తించినట్లు నేచర్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దీనితో మరోసారి వుహన్‌లో అలజడి రేగింది. అయితే నివాస ప్రాంతాల్లోని గాలిలో మాత్రం ఎటువంటి వైరస్ జాడ కనిపించలేదని తెలుస్తోంది. కాగా, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వుహన్‌లోని రెన్మిన్ ఆసుపత్రితో పాటు కరోనా బాధితులను క్వారంటైన్ చేసిన తాత్కాలిక కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు గాలి నమూనాలను సేకరించారు.

అంతేకాకుండా జనాలు నివాసం ఉండే ప్రాంతాల నుంచి కూడా గాలి నమూనాలను తీసుకున్నారు. వాటన్నింటిని విశ్లేషించిన తర్వాత ఆసుపత్రులు మినహాయించి మిగిలిన అన్ని చోట్లు సురక్షితంగా ఉన్నాయని తేల్చారు. గాలి నమూనాలు తప్పితే మరెక్కడా కూడా కరోనా జాడ కనిపించట్లేదు అట. అన్ని చోట్ల సురక్షితం అని గుర్తించారు. మరోవైపు ఆసుపత్రుల్లో జనం ఎక్కువగా గుమిగూడే ఐసోలేషన్ వార్డులు, బాధితుల గదులు, బాత్రూమ్‌ల గాలిలో అత్యల్ప స్థాయిలో వైరస్ జాడలు ట్రేస్ అయినట్లు పరిశోధకులు తెలుసుకున్నారు. మరి ఈ గాలిలో ఉన్న కరోనా వైరస్ ఎంతమేరకు ప్రభావం చూపుతున్నది వెల్లడి కాలేదు.

Read More:

ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ కార్డుదారులకు 30 కిలోల ఉచిత బియ్యం..

షాకింగ్: సీఎం సెక్యూరిటీలో ముగ్గురికి కరోనా పాజిటివ్…

మసీదులో సామూహిక ప్రార్ధనలు.. అంతలోనే మహిళా తహశీల్దార్ ఎంట్రీ.. ఏం జరిగిందంటే.!

గ్రేటర్‌లో కరోనా టెర్రర్.. పల్లీల వ్యాపారి ద్వారా ఏకంగా..

గుడ్ న్యూస్.. దేశంలో 10 వేల మంది కరోనాను జయించారు.

కర్నూలులో దారుణం..మహిళ ప్రాణం తీసిన రెడ్‌జోన్‌ ఆంక్ష‌లు..