పాక్‌లో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి.. గడిచిన 24 గంటల్లో..

| Edited By:

May 03, 2020 | 9:24 PM

ప్రస్తుతం కరోనా మహమ్మారి కాలం నడుస్తోంది. ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ బారినపడి అల్లాడిపోతున్నాయి. ఇప్పటి వరకు 34 లక్షల మందికిపైగా కరోనా బారినపడ్డారు. వీరిలో దాదాపు పది లక్షల మంది కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవ్వగా.. రెండున్నర లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మన పొరుగు దేశమైన పాక్‌లో కూడా కరోనా మహమ్మారి క్రమక్రమంగా విజృంభిస్తోంది. ప్రస్తుతం కరోనా ఇక్కడ నమోదైన కరోనా కేసుల సంఖ్య 19వేలు దాటింది. గడిచిన 24 […]

పాక్‌లో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి.. గడిచిన 24 గంటల్లో..
Follow us on

ప్రస్తుతం కరోనా మహమ్మారి కాలం నడుస్తోంది. ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ బారినపడి అల్లాడిపోతున్నాయి. ఇప్పటి వరకు 34 లక్షల మందికిపైగా కరోనా బారినపడ్డారు. వీరిలో దాదాపు పది లక్షల మంది కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవ్వగా.. రెండున్నర లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మన పొరుగు దేశమైన పాక్‌లో కూడా కరోనా మహమ్మారి క్రమక్రమంగా విజృంభిస్తోంది.

ప్రస్తుతం కరోనా ఇక్కడ నమోదైన కరోనా కేసుల సంఖ్య 19వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 989 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,103కు చేరింది. ఇక దేశ వ్యాప్తంగా కొత్తగా 23 మంది కరోనా బారినపడి మృతిచెందారు. దీంతో పాకిస్థాన్‌ దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి ఇప్పటి వరకు మృతిచెందిన 440 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని పాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా రెండు లక్షలకు పైగా టెస్టులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.