భారత్లో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో కాంట్రాక్ట్ అయిన వారు, ఢిల్లీ మర్కజ్ నిజాముద్దీన్కు వెళ్లిన వారే ఎక్కువగా ఉన్నారు. అయితే వీరితో ఎలాంటి సంబంధం లేకుండా విజయవాడలో ఓ మహిళకు కరోనా సోకింది. దీంతో ఆమెకు వైరస్ ఎలా సోకిందన్న దానిపై అధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారు.
అయితే కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 35 కేసులు నమోదయ్యాయి. అందులో విజయవాడ నుంచి 27 మంది ఉన్నారు. వారిలో నలుగురు విదేశాలకు వెళ్లిన వారు, 22 మంది ఢిల్లీ నేపథ్యం ఉన్న వారు కాగా.. కొండ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఉంది. దీంతో అసలు ఆ మహిళకు వైరస్ ఎలా సోకిందన్న దానిపై ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మూడో దశ ప్రారంభమైందా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఏపీలో ఇవాళ 17 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 365కు చేరింది.
Read This Story Also: లాక్డౌన్ వేళ.. ప్రేమించిన వాడితో పెళ్లి కోసం.. 40కి.మీల ఒంటరి నడక