కరోనా లక్షణాలున్నా దాచినందుకు ముగ్గురిపై కేసు నమోదు

| Edited By:

Apr 10, 2020 | 7:10 AM

కరోనా లక్షణాలు ఉన్నాయని తెలిసినా.. బయటకు చెప్పనందుకు తూర్పు గోదావరి జిల్లాలో ముగ్గురిపై కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్‌ అస్మి చెప్పిన వివరాల ప్రకారం..

కరోనా లక్షణాలున్నా దాచినందుకు ముగ్గురిపై కేసు నమోదు
Follow us on

కరోనా లక్షణాలు ఉన్నాయని తెలిసినా.. బయటకు చెప్పనందుకు తూర్పు గోదావరి జిల్లాలో ముగ్గురిపై కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్‌ అస్మి చెప్పిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా నుంచి శంఖవరం మండలం కత్తిపూడికి వచ్చిన ఓ వ్యక్తకి కరోనా లక్షణాలు కనిపించాయి. ఆయన ఓ ఆర్‌ఎంపీ వైద్యుడి వద్ద చికిత్స చేయించుకున్నారు. అయినా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఈ నేపథ్యంలో బాధితుడి మామ, వైద్యం చేసిన ఆర్ఎంపీ వైద్యుడు, అతడికి రక్త పరీక్షలు చేసిన ల్యాబ్ టెక్నీషియన్‌పై కేసులు నమోదయ్యాయి. బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటతో చికిత్స కోసం విశాఖపట్నానికి తరలించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నప్పుడు తెలియజేయకపోతే ఆ కుటుంబ సభ్యులతో పాటు వైద్యం చేసిన వారిపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎప్పీ నయీమ్‌ అన్నారు. కాగా ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 15 కేసులు నమోదు కాగా..  మొత్తం కేసుల సంఖ్య 363కు చేరింది.