కరోనా కలవరం.. దేశంలో కేసులు 1074, మృతులు 29
Coronavirus Updates: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇండియాలో వేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1074 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. వీరిలో 29మంది మరణించారు. ఇక మరో 101 మంది ఈ వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకున్నారని తెలిపింది. మహరాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. తాజాగా మహారాష్ట్రలో మృతుల సంఖ్య 8కి చేరుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 218 కేసులు నమోదయ్యాయి. ఇందులో 25 మంది కోలుకున్నట్లు అధికారులు […]
Coronavirus Updates: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇండియాలో వేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1074 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. వీరిలో 29మంది మరణించారు. ఇక మరో 101 మంది ఈ వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకున్నారని తెలిపింది. మహరాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. తాజాగా మహారాష్ట్రలో మృతుల సంఖ్య 8కి చేరుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 218 కేసులు నమోదయ్యాయి. ఇందులో 25 మంది కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
అటు కేరళలో 213కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒకరు ప్రాణాలు విడిచారు. ఇక ఈ వైరస్ కారణంగా గుజరాత్లో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. కర్ణాటకలో ముగ్గురు మరణించగా.. ఢిల్లీ, మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్లో ఇద్దరు చొప్పున.. అలాగే బీహార్, హిమాచల్ప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్లో ఒకరుచొప్పున మృతి చెందినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, తెలంగాణలో ఇప్పటివరకు 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఆంధ్రప్రదేశ్లో ఈ కేసుల సంఖ్య 23కు చేరింది.
ఇవి చదవండి:
కరోనా విలయ తాండవం.. కేసుల్లో అమెరికా, మృతుల్లో ఇటలీ టాప్..
దేశంలో తొలి కరోనా టెస్టింగ్ కిట్ వెనుకున్న ఆ మహిళ ఎవరంటే…
గుడ్ న్యూస్.. ఏపీలో కోలుకున్న మరో కరోనా బాధితుడు..
కరోనాపై పద్నాలుగేళ్ల కుర్రాడు ఏడు నెలల క్రితం ఏమన్నాడంటే.?
[table id=74 /]