శ్రియ భర్తకు కరోనా లక్షణాలు.. ఆసుపత్రిలో వద్దన్న డాక్టర్లు..!

తన భర్తకు కరోనా లక్షణాలు కనిపించాయని నటి శ్రియ వెల్లడించారు. తన భర్త ఆండ్రూ కొచీవ్‌కు పొడి దగ్గు, జ్వరం లాంటి కరోనా లక్షణాలు కనిపించాయని ఆమె తెలిపారు. దీంతో వెంటనే తాము స్పెయిన్ లోని బార్సెలోనాలోని ఆసుపత్రికి వెళ్లినట్లు శ్రియ పేర్కొన్నారు. అయితే అప్పుడు అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా.. డాక్టర్లు తమను ఇంటి దగ్గరే క్వారంటైన్‌లో ఉండమని సూచించారని అన్నారు. ఎందుకంటే కరోనా లేకుండా ఆసుపత్రిలో చేరితే.. ఆండ్రూకు కరోనా సోకే అవకాశాలు ఉన్నాయని వైద్యులు […]

శ్రియ భర్తకు కరోనా లక్షణాలు.. ఆసుపత్రిలో వద్దన్న డాక్టర్లు..!
Follow us

| Edited By:

Updated on: Apr 14, 2020 | 6:55 PM

తన భర్తకు కరోనా లక్షణాలు కనిపించాయని నటి శ్రియ వెల్లడించారు. తన భర్త ఆండ్రూ కొచీవ్‌కు పొడి దగ్గు, జ్వరం లాంటి కరోనా లక్షణాలు కనిపించాయని ఆమె తెలిపారు. దీంతో వెంటనే తాము స్పెయిన్ లోని బార్సెలోనాలోని ఆసుపత్రికి వెళ్లినట్లు శ్రియ పేర్కొన్నారు. అయితే అప్పుడు అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా.. డాక్టర్లు తమను ఇంటి దగ్గరే క్వారంటైన్‌లో ఉండమని సూచించారని అన్నారు. ఎందుకంటే కరోనా లేకుండా ఆసుపత్రిలో చేరితే.. ఆండ్రూకు కరోనా సోకే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తమకు వెల్లడించినట్లు శ్రియ తెలిపారు.

దీంతో ఇంటికి తిరిగొచ్చిన తాము వేర్వేరు గదిలో సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నామని శ్రియ తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నాయని అనుమానం వచ్చినప్పటి నుంచి ఆండ్రూ ఇంట్లోనే చికిత్స తీసుకున్నారని.. ప్రస్తుతం తన భర్త ఆరోగ్యం కుదుటపడిందని ఆమె అన్నారు. కాగా స్పెయిన్‌లో ఈ ఇద్దరు ప్రస్తుతం ఉండగా.. ఆ దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులను కూడా శ్రియ వివరించారు. కరోనా నేపథ్యంలో స్పెయిన్‌లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని.. అధికారులు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారని శ్రియ తెలిపారు. ఇక ఇంట్లో నుంచి కూడా ఎవ్వరినీ బయటకు రానీవడం లేదని.. అత్యవసర వేళల్లో కూడా ఇంట్లో నుంచి ఒకరికి మాత్రమే బయటకు రావడానికి అనుమతిని ఇస్తున్నారని శ్రియ అక్కడి పరిస్థితులను పేర్కొన్నారు.

Read This Story Also: నీరులా ఎన్టీఆర్.. నిప్పులా చెర్రీ.. అసలు కారణం చెప్పిన జక్కన్న..!