ఏపీ కరోనా అప్డేట్స్:10,368 కొత్త కేసులు.. 84 మరణాలు
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 10,368 కరోనా కేసులు నమోదయ్యాయి
Andhra Pradesh Corona Updates: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 10,368 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,42,244కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 84 మంది మరణించగా.. మృతుల సంఖ్య 4,053కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9,350 మంది కరోనాను జయించగా.. కోలుకున్న వారి సంఖ్య 3,36,981కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 37,82,746 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,01,210 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 456, చిత్తూరులో 1068, తూర్పు గోదావరిలో 1208, గుంటూరులో 617, కడపలో 994, కృష్ణాలో 311, కర్నూలులో 813, నెల్లూరులో 1059, ప్రకాశంలో 888, శ్రీకాకుళంలో 629, విశాఖలో 825, విజయనగరంలో 552, పశ్చిమ గోదావరిలో 948 కేసులు నమోదయ్యాయి.
Read More:
‘కన్నానులే’ పాటకు లావణ్య స్టెప్పులు.. అదరగొట్టిందిగా
ఆ ఐదు రాష్ట్రాల్లోనే కరోనా అధికం: కేంద్ర ఆరోగ్య శాఖ
#COVIDUpdates: 01/09/2020, 10:00 AMరాష్ట్రం లోని నమోదైన మొత్తం 4,42,244 పాజిటివ్ కేసు లకు గాను *3,36,981 మంది డిశ్చార్జ్ కాగా*4,053 మంది మరణించారు* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,01,210#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/m77DYxmGP1
— ArogyaAndhra (@ArogyaAndhra) September 1, 2020