కరోనా వైరస్తో కాంగ్రెస్ నేత మృతి..
హైదరాబాద్కు చెందిన కాంగ్రెస్ నేత జి నరేందర్ రెడ్డి కరోనా వైరస్తో మృతి చెందారు. ఇటీవలే కోవిడ్ బారిన పడ్డ రోగులకు అందించే సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు నరేందర్ యాదవ్. అనంతరం ఆయన కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించగా కరోనా వైరస్ సోకినట్టు..
కరోనా వైరస్ పాజిటివ్తో మరో కాంగ్రెస్ నేత మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో కోవిడ్ తీవ్రంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక హైదరాబాద్ నగరంలో అయితే.. రోజుకీ వందల కేసులు నమోదవుతున్నాయి. అందులోనూ పలువురు రాజకీయ ప్రముఖులు, వైద్యులు, పోలీసు సిబ్బంది, పలువురు ప్రముఖ నటులు ఈ వైరస్ బారిన పడటంతో.. ప్రజలు మరింత భయాందోళనలకు గురవుతున్నారు.
తాజాగా హైదరాబాద్కు చెందిన కాంగ్రెస్ నేత జి నరేందర్ రెడ్డి కరోనా వైరస్తో మృతి చెందారు. ఇటీవలే కోవిడ్ బారిన పడ్డ రోగులకు అందించే సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు నరేందర్ యాదవ్. అనంతరం ఆయన కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించగా కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు పేర్కొన్నారు. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇటీవల గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమాల్లో కూడా నరేందర్ పాల్గొన్నారు. దీంతో నరేందర్ ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారో వారికి కూడా టెస్టులు చేస్తున్నారు వైద్యులు. కాగా నరేందర్ మృతికి పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
Read More: బ్రేకింగ్: ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కరోనా..