ఏపీలో ‘రైతు మిషన్’
అమరావతి: వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు జగన్ సర్కార్ ‘రైతు మిషన్’ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ మిషన్ను నెలకొల్పుతూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మిషన్కు ఉపాధ్యక్షుడిగా రైతు నేత నాగిరెడ్డిని నియమించగా.. ఐదుగురు ఏపీ మంత్రులతో పాటు ఇతర సభ్యులు కూడా ఇందులో ఉండనున్నారు. మిషన్ కార్యకలాపాలకు వ్యవసాయ శాఖకు కేటాయించే నిధుల నుంచి ఖర్చు చేస్తారని ప్రభుత్వం […]
అమరావతి: వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు జగన్ సర్కార్ ‘రైతు మిషన్’ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ మిషన్ను నెలకొల్పుతూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మిషన్కు ఉపాధ్యక్షుడిగా రైతు నేత నాగిరెడ్డిని నియమించగా.. ఐదుగురు ఏపీ మంత్రులతో పాటు ఇతర సభ్యులు కూడా ఇందులో ఉండనున్నారు. మిషన్ కార్యకలాపాలకు వ్యవసాయ శాఖకు కేటాయించే నిధుల నుంచి ఖర్చు చేస్తారని ప్రభుత్వం తెలిపింది.