
Telangana EAPCET 2026: తెలంగాణలోని ప్రభుత్వ వర్సిటీలు, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈఏపీసెట్ (EAPCET) ఇంజనీరింగ్ తుదివిడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం సీట్లు భర్తీ కాగా, ఇంకా 19,102 సీట్లు (సుమారు 20%) ఖాళీగా మిగిలిపోయాయి.
ప్రభుత్వ కాలేజీ (కోస్గి): రాష్ట్రంలోని ఏకైక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలోని 214 సీట్లలో కేవలం 45 సీట్లు (21%) మాత్రమే భర్తీ కావడం గమనార్హం. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మెజారిటీ విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, దానికి సంబంధించిన అలైడ్ కోర్సుల వైపే మొగ్గు చూపారు.
తక్కువ సీట్లు అందుబాటులో ఉన్న సీఆర్సీ, సీఐటీ, బయోమెడికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్, వీఎల్ఎస్ఐ డిజైన్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటలర్జికల్, మెకాట్రానిక్స్, ఆటోమొబైల్ కోర్సుల్లో 100% సీట్లు భర్తీ అయ్యాయి.
తుదివిడత కౌన్సెలింగ్లో సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 7వ తేదీలోగా కేటాయించిన ఫీజును చెల్లించి, సంబంధిత కాలేజీలో స్వయంగా రిపోర్టు చేయాలని సాంకేతిక విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.