
దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో 2025 సంవత్సరానికి సంబంధించి ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 312 చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ పబ్లిసిటీ న్స్పెక్టర్, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ తదితర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్పూర్, కోల్కతా, ముంబయి, పట్నా, ప్రయాగ్రాజ్.. ఆర్ఆర్బీ రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఆర్ఆర్బీ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల నోటిఫికేషణ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్మీడియట్, లా డిగ్రీ, సంబంధిత విభాగాల్లో డిప్లొమా, పీజీ డిప్లొమా, ఎంబీఏ, మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో జనవరి 29, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనలర్ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్, ఈబీసీ, మైనారిటీ అభ్యర్ధులు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఆన్లైన్ రాత పరీక్ష, ట్రాన్స్లేషన్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.19,000, జూనియర్ ట్రాన్స్లేటర్, ఇన్స్పెక్టర్స్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు రూ.35,400, ఇతర పోస్టులకు రూ.44,900 చొప్పున జీతంగా చెల్లిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.