NCERT Recruitment: భారత ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగావకాశాలు.. అర్హులెవరు.? ఎలా ఎంపిక చేస్తారు.?

నేషనల్ కౌన్సిల్ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (NCERT) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలో ఉండే ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న మొత్తం 347 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

NCERT Recruitment: భారత ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగావకాశాలు.. అర్హులెవరు.? ఎలా ఎంపిక చేస్తారు.?
Ncert Jobs

Updated on: May 01, 2023 | 8:02 PM

నేషనల్ కౌన్సిల్ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (NCERT) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలో ఉండే ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న మొత్తం 347 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎవరు అర్హులు..? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 347 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఎడిటర్, బిజినెస్‌ మేనేజర్‌, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, ప్రొడక్షన్ మేనేజర్, సౌండ్ రికార్డిస్ట్ గ్రేడ్-I, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వంటి పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్, ఐటీఐ, బ్యాచిల‌ర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, బీటెక్, బీఈ, ఎంటెక్, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల యవసు 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను కాంపిటేటివ్‌ ఎగ్జామ్‌, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు మే 19వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..