School reopening guidelines and SOPs: స్కూళ్ల ప్రారంభానికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం గురువారం (ఫిబ్రవరి 3, 2022) విడుదల చేసింది. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రల్లో ఇప్పటికే విద్యాసంస్థలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. విద్యాసంస్థల పునఃప్రారంభంపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం కేంద్ర విద్యాశాఖ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ముందు జాగ్రత్త చర్యలు, స్కూల్ టైమ్టేబుల్, భావోద్వేగ, మానసిక ఆరోగ్యాలకు సంబంధించిన సూచనలు ఇందులో పొందుపరిచారు. ఇప్పటి వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లోని మొత్తం 98.85% టీచింగ్, 99.07% నాన్ టీచింగ్ స్టాఫ్కు టీకాలు వేయడం పూర్తిచేసింది. విద్యార్థులు కోరితే అన్లైన్ విద్యకు అనుమతి ఇవ్వవలసిందిగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలిపింది.
విద్యాసంస్థల పునఃప్రారంభానికి సంబంధించి కేంద్ర మార్గదర్శకాలు ఇవే..