
హైదరాబాద్, జులై 21: దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ న్యాయ యూనివర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్(UG), పోస్టు గ్రాడ్యుయేట్ (PG) లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) 2026 ప్రవేశ పరీక్ష తేదీ విడుదలైంది. ఈ పరీక్ష షెడ్యూల్ను తాజాగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 24 నేషనల్ లా వర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. తాజా షెడ్యూల్ ప్రకారం క్లాట్ 2025 పరీక్ష డిసెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ఈ పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తులు ఆగస్టు 1 నుంచి ప్రారంభంకానున్నాయి. దరఖాస్తులకు చివరి తేదీగా అక్టోబరు 31ని నిర్ణయించారు.
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ, ఏడాది ఎల్ఎల్ఎం (యూజీ, పీజీ, డిగ్రీ) ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర వివరాలు అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.
ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కీలక అప్డేట్ జారీ చేసింది. వెబ్ ఆప్షన్లు నమోదుకు తుది గడువును పెంపొందిస్తూ ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన మేరకు తుది గడువు జులై 25 వరకు పొడిగించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ జి రామచంద్రరావు ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతిలోని వ్యవసాయ కాలేజీలోనూ అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు పొందేందుకు వెబ్ ఆప్షన్లలో అవకాశం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని అన్నారు. ఇతర వివరాలను అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.