
RBI: 2023 మే నెలలో రూ. 2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అప్పటి నుండి సుమారు 97% పైగా నోట్లు తిరిగి బ్యాంకులకు చేరుకున్నాయి. అయితే ఈ పాత నోట్లను గతంలో లాగా కాల్చివేయడం లేదు. దీని కోసం ఆర్బీఐ ఒక అత్యాధునిక పద్ధతిని అనుసరిస్తోంది.
బ్యాంకులకు తిరిగి వచ్చిన నోట్లు నేరుగా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు చేరుతాయి. అక్కడ CVPS (Currency Verification and Processing System) అనే యంత్రాల ద్వారా వీటిని పరీక్షిస్తారు. అవి అసలు నోట్లా కాదా అని నిర్ధారించుకున్నాక, వాటిని లెక్కించి తదుపరి దశకు పంపిస్తారు.
నిర్ధారణ పూర్తయిన తర్వాత ఆ నోట్లను భారీ యంత్రాల సహాయంతో అతి చిన్న ముక్కలుగా కత్తిరిస్తారు. దీనిని ‘ష్రెడ్డింగ్’ అంటారు. నోటును గుర్తు పట్టలేనంతగా చిన్న చిన్న ముక్కలుగా చేయడం వల్ల వాటిని మళ్లీ ఎవరూ వినియోగించే అవకాశం ఉండదు.
కత్తిరించిన నోట్ల ముక్కలను అధిక పీడనం (High Pressure) ఉపయోగించి ‘బ్రిక్వెట్స్’ (ఇటుకల వంటి దిమ్మలు) గా మారుస్తారు. పూర్వం నోట్లను తగులబెట్టేవారు. కానీ అది కాలుష్యానికి కారణమవుతుందని ఇప్పుడు ఈ ‘బ్రిక్వెటింగ్’ పద్ధతిని వాడుతున్నారు.
ఇలా తయారైన కాగితపు దిమ్మలను వివిధ పారిశ్రామిక అవసరాల కోసం విక్రయిస్తారు. అవి..
ఇది కూడా చదవండి: Indian Railways: రైలు బోగీపై SLR అని ఎందుకు రాసి ఉంటుంది? ఇది స్లీపర్ కోచ్ కాదు.. చాలా మందికి తెలియని ఆసక్తికర నిజాలు!
ప్రస్తుతం ఆర్బీఐ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం, దాదాపు రూ. 3.5 లక్షల కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు వ్యవస్థలోకి తిరిగి వచ్చాయి. చలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 98.47 శాతం తిరిగి వచ్చాయని, రిజర్వ్ బ్యాంక్ మే 1, 2026) తెలిపింది. రూ.5,451 కోట్ల విలువైన 2,000 రూపాయల నోట్లు చెలామణిలో ఉన్నాయి. వీటన్నింటినీ పైన పేర్కొన్న పద్ధతిలో పర్యావరణానికి హాని కలగకుండా రీసైక్లింగ్ ప్రక్రియ ద్వారా వేరే ఉత్పత్తులుగా మారుస్తున్నారు.
ఇది కూడా చదవండి: Interesting Story: తులం బంగారం ధర కేవలం రూ.90 మాత్రమే.. అప్పట్లో పాలు, చక్కెర ధరలు వింటే షాక్ అవ్వాల్సిందే!
ఇది కూడా చదవండి: D-Mart Secrets: డి-మార్ట్ షాపింగ్ సీక్రెట్స్.. రూ.5000 బిల్లును రూ.2000కు తగ్గించుకునే సూపర్ ట్రిక్స్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి