
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఫీసీఐ) రూపొందించింది. స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి తక్షణమే డబ్బును బదిలీ చేయడానికి వీలు కల్పించే రియల్ టైమ్ చెల్లింపు వ్యవస్థ ఇది. నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ దీని ద్వారా చెల్లింపులు జరుగుతున్నారు. కేవలం ఇతరులకు మెసేజ్ పంపినంత సులువుగా నగదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
యూపీఐ విధానంలో లావాదేవీలు చేయాలనుకునే వారికి బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి. సాధారణంగా యూపీఐ విధానాన్ని భీమ్ యాప్ లో వినియోగిస్తారు. దీన్ని ఎన్పీసీఐ డెవలప్ చేసింది. దీనితో పాటు ప్రైవేటు యాప్ లైన పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి వాటి ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు. అయితే మీ ఫోన్ నంబర్ ను మాత్రం బ్యాంకు ఖాతాకు తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలి. ఇంటర్నెట్ కనెక్టివీటి ఉన్న స్మార్ట్ ఫోన్, యూపీఐ ఎనేబుల్డ్ మొబైల్ యాప్, రిజిస్టర్డ్ యూపీఐ ఐడీ, యూపీఐ పిన్ సెట్ చేయడానికి చెల్లుబాటు అయ్యే డెబిట్ కార్డు చాలా అవసరం.
యూపీఐ ఐడీ ద్వారా డబ్బులను ఇతరులకు పంపించవచ్చు. పిన్ నంబర్ నమోదు చేయడం ద్వారా చాలా సులువుగా బదిలీ జరుగుతుంది.
మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా డబ్బులను ఇతరులకు పంపించవచ్చు. ఉదాహరణకు మీ ఫోన్ కాంటాక్ట్ లో నంబర్ ను ఎంపిక చేసుకోవచ్చు. లేకపోతే కొత్తగా నంబర్ ఎంటర్ చేయవచ్చు. ఇలా డబ్బును చాలా సులభంగా ఇతరులకు పంపవచ్చు.
స్కాన్ అండ్ పే ఫీచర్ ద్వారా డబ్బులను పంపించేందుకు కూడా అవకాశం ఉంది. గ్రహీతకు సంబంధించి క్యూాఆర్ కోడ్ ను స్కాన్ చేసి, నగదును నమోదు చేయాలి. అనంతరం యూపీఐ పిన్ ను ఎంటర్ చేస్తే చాలు.
గ్రహీత బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్ సీ, పేరును నమోదు చేయడం ద్వారా కూడా డబ్బును పంపించవచ్చు. లావాదేవీ పూర్తయిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి