పరిమితికి మించిన ఆదాయం కలిగిన వారందరూ ఆదాయం పన్ను తప్పనిసరిగా చెల్లించాలి. ముందుగా ఆదాయపు పన్నుశాఖకు ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలి. అనంతరం మీరు పన్ను కట్టాల్సిన ఆదాయంపై అవగాహన కలుగుతుంది. అయితే ఆదాయపు పన్ను చెల్లింపుల ద్వారా కూడా రివార్డులు, క్యాష్ బ్యాక్ లు పొందే అవకాశం ఉంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో ఆదాయపు పన్నును చెల్లించి వీటిని పొందవచ్చు. అలాగే ఆదాయపు పన్నుచట్టంలోని వివిధ సెక్షన్ల ద్వారా కొన్ని మినహాయింపులు లభిస్తాయి. వీటినన్నింటినీ అనుసరించడం ద్వారా ఆదాయపు పన్ను ను ఆదా చేసుకోవచ్చు.
మన దేశంలో కొన్ని క్రెడిట్ కార్డుల ద్వారా మాత్రమే ఆదాయపు పన్నుపై రివార్డ్ పాయింట్లు పొందవచ్చు. హెచ్ డీఎఫ్ సీ బిజ్ బ్లాక్, హెచ్ డీఎఫ్ సీ బిజ్ పవర్ తదితర క్రెడిట్ కార్డుల నుంచి ఈ అవకాశం ఉంది. వీటి ద్వారా ఆదాయపు పన్ను, జీఎస్ టీలను చెల్లించి 16 శాతం నుంచి 8 శాతం వరకు రివార్డులు, క్యాష్బ్యాక్ను అందిస్తాయి.
ఎస్ బీఐ విస్తారా, ఐడీఎఫ్ సీ విస్తారా తదితర క్రెడిట్ కార్డుల ద్వారా కూడా ఇలాంటి రివార్డులు పొందే అవకాశం ఉంది. ఇవి ఆదాయపు పన్ను చెల్లింపుపై మైల్స్టోన్ రివార్డులు అందజేస్తాయి.
2023 – 24 (ఏవై 2024–25) ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి జూలై 31 వరకూ మాత్రమే అవకాశం ఉంది. ఆ గడువు దాటితే జరిమానా విధిస్తారు. జరిమానాతో ఐటీఆర్ దాఖలు చేేసే అవకాశం డిసెంబర్ 31 వరకూ ఉంటుంది.
ఆదాయపు పన్నును ఆదా చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని అనుసరించడం ద్వారా మీరు కొంత పన్నుభారాన్ని తగ్గించుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం ద్వారా ఇవి అమలవుతున్నాయి. పూర్తి చట్టబద్ధత కలిగినవి కూడా.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..