Richest Women: భారతదేశంలో అత్యంత సంపన్న మహిళలు.. ఎవరికి ఎంత ఆదాయం!

|

Aug 25, 2024 | 6:49 PM

నేటి కాలంలో పురుషుల కంటే దేశంలో మహిళలు తక్కువేమీ కాదు. చదువు నుంచి సంపాదన వరకు అన్ని రంగాల్లోనూ వారి ప్రభావం ఉంటుంది. ఫోర్బ్స్ ఇటీవల దేశంలోని టాప్ 10 సంపన్న మహిళల జాబితాను విడుదల చేసింది. ఇందులో దేశంలోని ప్రముఖ మహిళల పేర్లు ఉన్నాయి. ఫోర్బ్స్ ప్రకారం.. ఈ మహిళల సంపద బిలియన్ల విలువైనది. వారికి ఎంత సంపద ఉంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం...

Richest Women: భారతదేశంలో అత్యంత సంపన్న మహిళలు.. ఎవరికి ఎంత ఆదాయం!
Richest Women
Follow us on

నేటి కాలంలో పురుషుల కంటే దేశంలో మహిళలు తక్కువేమీ కాదు. చదువు నుంచి సంపాదన వరకు అన్ని రంగాల్లోనూ వారి ప్రభావం ఉంటుంది. ఫోర్బ్స్ ఇటీవల దేశంలోని టాప్ 10 సంపన్న మహిళల జాబితాను విడుదల చేసింది. ఇందులో దేశంలోని ప్రముఖ మహిళల పేర్లు ఉన్నాయి. ఫోర్బ్స్ ప్రకారం.. ఈ మహిళల సంపద బిలియన్ల విలువైనది. వారికి ఎంత సంపద ఉంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సావిత్రి జిందాల్: భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్. 73 ఏళ్ల సావిత్రి జిందాల్ OP జిందాల్ గ్రూప్ గౌరవాధ్యక్షురాలు. ఆమె భర్త ఓపీ జిందాల్ 2005లో మరణించారు. అప్పటి నుండి ఆమె తన భర్త కంపెనీని పూర్తి బాధ్యతతో నిర్వహిస్తోంది. భారత సంపన్న మహిళల జాబితాలో సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆమె మొత్తం నికర విలువ 39.5 బిలియన్ డాలర్లు.

రేఖా ఝున్‌జున్‌వాలా: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్, బిగ్ బుల్‌గా ప్రసిద్ధి చెందిన రాకేష్ జున్‌జున్‌వాలా భార్య రేఖా ఝున్‌జున్‌వాలా: ధనవంతుల జాబితాలో రెండవ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ ప్రకారం, రేఖా జున్‌జున్‌వాలా మొత్తం నికర విలువ $8.7 బిలియన్లు. ప్రస్తుతం టైటాన్ కంపెనీ కాకుండా, అనేక ఇతర కంపెనీలలో పెద్ద వాటాదారు. ఆమె పోర్ట్‌ఫోలియోలో టైటాన్, స్టార్ హెల్త్, అలైడ్ ఇన్సూరెన్స్, మెట్రో బ్రాండ్స్ వంటి స్టాక్‌లు ఉన్నాయి.

వినోద్ రాయ్ గుప్తా- రేణుకా జగ్తియాని: హావెల్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గుప్తా తల్లి అయిన వినోద్ రాయ్ గుప్తా. ఆమె సంపద $ 6 బిలియన్లు. హావెల్స్ ఇండియా ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, స్విచ్‌లు మొదలైన అనేక ఎలక్ట్రానిక్ సంబంధిత వస్తువులను తయారీదారు. ల్యాండ్‌మార్క్ గ్రూప్ సీఈవో రేణుకా జగ్తియానీ నాలుగో స్థానంలో ఉన్నారు. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్త రిటైల్ రంగంలో ఉన్న గ్లోబల్ కన్స్యూమర్ గ్రూప్. ఆమె మొత్తం సంపద 4.8 బిలియన్ డాలర్లు.

అను అగా-స్మితా కృష్ణ : ఫోర్బ్స్‌లో దేశంలోని ఐదవ అత్యంత సంపన్న మహిళగా అనూ అగా ఉన్నారు. ఆమె మొత్తం సంపద 4 బిలియన్ డాలర్లు. అను అగా 1980లలో థర్మాక్స్ అనే ఇంజనీరింగ్ కంపెనీలో తన భర్తతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. 1996లో ఆయన మరణానంతరం దాని పగ్గాలు అను చేపట్టారు. 2004లో పదవీవిరమణ చేసి, తన కుమార్తె మెహర్ పుదుమ్‌జీని బాధ్యతలు స్వీకరించడానికి అనుమతించారు. దీని తర్వాత దేశంలోనే అత్యంత సంపన్న మహిళ స్మితా కృష్ణ. ఆమె వద్ద 4 బిలియన్ డాలర్ల సంపద ఉంది. గోద్రెజ్ కుటుంబానికి చెందిన స్మితా కృష్ణ-గోద్రెజ్ కుటుంబ ఆస్తులలో 20 శాతం గణనీయమైన వాటాను కలిగి ఉన్నారు.

ఫల్గుణి నాయర్- రాధా వెంబు: ధనిక మహిళల జాబితాలో తదుపరి పేరు Nykaa ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్, CEO ఫల్గుణి నాయర్. $3.5 బిలియన్ల నికర సంపదతో ఉన్నారు. ఆమె దేశంలో ఎనిమిదో అత్యంత సంపన్న మహిళా వ్యాపారవేత్త. ఫల్గుణి నాయర్ కంపెనీ Nykaa సౌందర్య ఉత్పత్తుల తయారీలో ప్రముఖ కంపెనీ. Nykaaలో సగం వాటా ఫల్గుణి నాయర్‌కు ఉంది. మాజీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ ఫల్గుణి నాయర్ 2012లో ఈ కంపెనీని స్థాపించారు. దేశంలోని ధనిక మహిళల్లో రాధా వెంబు కూడా ఉన్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో మంచి పేరుంది. రాధ భారతదేశంలో ఎనిమిదో అత్యంత సంపన్న మహిళ. ఆమె మొత్తం నికర విలువ 3.3 బిలియన్ డాలర్లు. ఆమె కంపెనీ పేరు జోహో కార్పొరేషన్.

కిరణ్ మజుందార్ షా-లీనా తివారీ: భారతదేశంలోని టాప్-10 సంపన్న మహిళల్లో కిరణ్ మజుందార్ షా పేరు తొమ్మిదో స్థానంలో ఉంది. ఫోర్బ్స్ ప్రకారం, ఆమె మొత్తం నికర విలువ 3.3 బిలియన్ డాలర్లు. కిరణ్ మజుందార్ షా ఫార్మా రంగ దిగ్గజం బయోకాన్ చైర్‌పర్సన్. కరోనా కాలంలో ఆమె కంపెనీ ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. దేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో లీనా తివారీ పదో స్థానంలో నిలిచారు. ఆమె సంపద 3.1 బిలియన్ డాలర్లు. లీనా తివారీ USV ఫార్మా నడుపుతున్నారు.

ఇది కూడా చదవండి: Train Coaches: సూపర్‌ఫాస్ట్ రైళ్లలో రెడ్ కలర్‌ బోగీలు ఎందుకు ఉంటాయో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి