Elon Musk: ఎలోన్ మస్క్ కుర్చీ ఖాళీ అవుతోందా? టెస్లా బోర్డు కొత్త CEOను నియమించనుందా?

అదే సమయంలో మస్క్ తన భాగస్వామ్యానికి సంబంధించి గత వారం ఒక ప్రకటన కూడా ఇచ్చారు. ట్రంప్ పరిపాలనా పనులపై గడిపే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తారని, తన వ్యాపార సామ్రాజ్యంపై ఎక్కువ దృష్టి పెడతారని ఆయన అన్నారు. మస్క్ ప్రస్తుతం US..

Elon Musk: ఎలోన్ మస్క్ కుర్చీ ఖాళీ అవుతోందా? టెస్లా బోర్డు కొత్త CEOను నియమించనుందా?

Updated on: May 01, 2025 | 6:21 PM

ప్రపంచంలో అత్యంత చర్చనీయాంశమైన కంపెనీలలో ఒకటైన టెస్లాలో పెద్ద మార్పు సంకేతాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా తన కొత్త CEO కోసం వెతుకులాట ప్రారంభించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. దాదాపు ఒక నెల క్రితం టెస్లా బోర్డు సభ్యులు కంపెనీ ప్రస్తుత CEO ఎలోన్ మస్క్ వారసుడిని కనుగొనడానికి అనేక ఎగ్జిక్యూటివ్ సెర్చ్ సంస్థలను సంప్రదించారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంలో కీలకంగా మారిన ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్‌ను టెస్లా సీఈఓ బాధ్యతల నుంచి తప్పించాలని కంపెనీ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: World’s Richest Actors: ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన నటులు.. షారుఖ్ ఖాన్ ర్యాంకింగ్ ఎంత?

ట్రంప్ పరిపాలనలో మస్క్ ప్రమేయం పెరుగుతున్నందున బోర్డు ఈ ప్రయత్నం ప్రారంభించిందని కూడా నివేదిక ద్వారా సమాచారం. మస్క్ వాషింగ్టన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. నెలల తర్వాత మార్చిలో జరిగిన ఆల్-హ్యాండ్స్ సమావేశంలో చివరిసారిగా మస్క్‌ను చూశామని ఉద్యోగులు చెబుతున్నారు.

వ్యాపార సామ్రాజ్యంపై దృష్టి సారిస్తాం:

అదే సమయంలో మస్క్ తన భాగస్వామ్యానికి సంబంధించి గత వారం ఒక ప్రకటన కూడా ఇచ్చారు. ట్రంప్ పరిపాలనా పనులపై గడిపే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తారని, తన వ్యాపార సామ్రాజ్యంపై ఎక్కువ దృష్టి పెడతారని ఆయన అన్నారు. మస్క్ ప్రస్తుతం US డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) కింద ఫెడరల్ ఉద్యోగాలను తగ్గించే కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నాడు. అదే సమయంలో ఈ కాలంలో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు కూడా తగ్గుతున్నాయి. దీని కారణంగా ఇన్వెంటరీ పెరుగుతోంది.

ఖండించిన టెస్లా..

ఇదిలా ఉండగా, టెస్లా కంపెనీ మస్క్‌ స్థానంలో కొత్త సీఈవోను నియమించాలని బోర్డు భావిస్తోందని, అందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ప్రచురించిన కథనాన్ని టెస్లా కంపెనీ ‘ఎక్స్‌’ వేదికగా ఖండించింది. దీనిని కంపెనీ కొట్టిపారేసింది. ఇవి తప్పుడు కథనాలు అని పేర్కొంది.

 


ఇది కూడా చదవండి: UPI New Rules: ఇప్పుడు యూపీఐ చెల్లింపు పొరపాటున కూడా మరొకరికి వెళ్లదు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి