Swiggy 2024 సంవత్సరానికి సంబంధించిన ఓ నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. జనవరి 1, 2024 నుంచి నవంబర్ 22, 2024 మధ్య సేకరించిన డేటాపై ఈ నివేదకను విడుదల చేశారు.
గత సంవత్సరం మాదిరిగానే, బిర్యానీ భారతదేశంలో పాపులార్గా నిలిచింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్గా బిర్యానీ నిలిచింది. 2024లో స్విగ్గీ 83 మిలియన్ల బిర్యానీ ఆర్డర్లను అందుకుంది. దీని ప్రకారం దేశంలో నిమిషానికి 158 బిర్యానీలు (ప్రతి సెకనుకు దాదాపు 2 ఆర్డర్లు) ఆర్డర్ వచ్చాయి.
బిర్యానీ తర్వాత, స్విగ్గీ దోస ప్రజాదరణ పొందింది. అందులో ఈ సంవత్సరం 23 మిలియన్ ఆర్డర్లను వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. చికెన్ బిర్యానీని ఎక్కువ మంది ఇష్టపడినట్లు తెలిపింది.
స్విగ్గీకి ఈ ఏడాది 49 మిలియన్ ఆర్డర్లు వచ్చాయి. ఈ స్విగ్గీ ఆర్డర్లలో ఎక్కువ భాగం దక్షిణాది రాష్ట్రాల ప్రజలే ఉండడం గమనార్హం. . 2024లో 9.7 మిలియన్ బిర్యానీ ఆర్డర్లతో "బిర్యానీ లీడర్బోర్డ్"లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది.
దాని తర్వాత బెంగళూరు (7.7 మిలియన్ ఆర్డర్లు), చెన్నై (4.6 మిలియన్లు) ఉన్నాయి. రాత్రి 12 నుండి 2 గంటల మధ్య చికెన్ బర్గర్స్ను ఎక్కువ మంది ఆర్డర్ చేసుకోగా, బిర్యానీ దాని తర్వాత స్థానంలో ఉంది.
రైళ్లలో సర్వసాధారణంగా ఆర్డర్ చేయబడిన ఆహారంలో బిర్యానీ కూడా ఒకటి అని స్విగ్గీ వెల్లడించింది. భారతదేశంలో రంజాన్ 2024 సందర్భంగా ప్లాట్ఫారమ్ ద్వారా సుమారు 6 మిలియన్ ప్లేట్ల బిర్యానీని ఆర్డర్ చేసినట్లు సంవత్సరం ప్రారంభంలో స్విగ్గీ వెల్లడించింది.