దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్గా ట్రేడింగ్ అవుతున్నాయి. ఉదయం 10.55 సమయంలో సెన్సెక్స్ 203.7 పాయింట్లు నష్టపోయి 36,856.67 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 71.5 పాయింట్లు నష్టపోయి 10,847.20 వద్ద కొనసాగుతున్నాయి. సెబీ పలు నిబంధనల్లో మార్పులు తీసుకురావడంతో మార్కెట్ జాగ్రత్తగా స్పందిస్తోంది. ప్రభుత్వం ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ వాహనాల రవాణపై బ్యాన్ తేదీలను నిర్ణయించలేదని రవాణ శాఖా మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొనడం ఆటో సెక్టర్కు ఊరటనిచ్చేదిగా ఉంది. ఇక డాలర్తో రూపాయి మారకం విలువ 71.6 గా ఉంది.