
తక్కువ ఖర్చుతో సుదీర్ఘ ప్రయాణాలు చేయాలనుకునే వారికి రైల్వే ప్రయాణం ఒక మంచి ఎంపిక. అందుకే చాలా మంది ట్రైన్లో ప్రయాణించడానికి ఇష్టపడుతారు. అదే కాకుండా ప్రయాణికుల భద్రతా, సౌకర్యం దృష్ట్యా రైల్వే శాఖ చేపడుతున్న మార్పులు కూడా ప్రయాణికులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. దీంతో ట్రైన్లలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొత్త సర్వీసులను ప్రారంభించేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే శాఖ గుంతకల్లు – మార్కాపూర్ రోడ్ – గుంతకల్లు (నంద్యాల మీదుగా) రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వీస్ ప్రవేశపెట్టాలని మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపగా.. అందుకు మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ రైలు సేవలు త్వరలో అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.
కొత్త సర్వీస్ల వివరాలు
ఈ రైళ్లు ఎక్కడెక్కడ ఆగుతాయి
ఈ రైళ్లు మార్గ మధ్యంలో మద్దికెర, పెండేకల్లు, ధోన్ , రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లె, జగ్గంభొట్ల కృష్ణాపురం, కంబం మరియు తర్లుపాడు స్టేషన్లలో ఇరు వైపు ప్రయాణంలో ఆగుతాయి.
ఈ నూతన ప్యాసింజర్ రైలు సర్వీసు ప్రారంభం ద్వారా గుంతకల్లు, మార్కాపూర్ రోడ్ మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు ప్రయోజనం చేకూరడమేకాకుండా మార్గ మధ్యంలోని నంద్యాల, గిద్దలూరు, కంభం మొదలైన ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ రైలు విద్యార్థులకు, వ్యాపారస్థులకు, ఇతర ప్రయాణికులకు పైన పేర్కొన్న స్టేషన్లకు చేరుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, తక్కువ ఛార్జీతో ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.