
టెలికం పరిశ్రమలో విప్లవాత్మక విధానాలకు పేరుగాంచిన రిలయన్స్ జియో బడ్జెట్ అనుకూలమైన ఎలక్ట్రిక్ సైకిల్తో ఈవీ మార్కెట్లోకి ప్రవేశించనుందని సమాచారం. ఈ సమాచారం జియో కంపెనీ అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం 2025 నాటికి 400 కి.మీ.ల రేంజ్, రూ. 30,000 ప్రారంభ ధరతో జియో ఈ-సైకిల్ లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణానికి అనువుగా ఉండేలా ఈ సైకిల్ను రూపొందిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియా బజ్ ప్రకారం ఈ సైకిల్ ధర వేరియంట్ను బట్టి రూ. 30,000 నుండి రూ. 50,000 మధ్య ఉంటుందని అంచనా
జియో ఎలక్ట్రిక్ సైకిల్ రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. ఈ బ్యాటరీ వేగవంతమైన ఛార్జింగ్కు మద్దతు ఇస్తుందని, డౌన్టైమ్ను తగ్గిస్తుందని, వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు. స్మూత్ యాక్సిలరేషన్, మల్టీ రైడింగ్ మోడ్లు (ఎకో, నార్మల్, స్పోర్ట్), వేగం, బ్యాటరీ స్థాయి, ట్రిప్ వివరాలను ప్రదర్శించే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఈ సైకిల్ ప్రత్యేకతలుగా ఉన్నాయి. అధునాతన ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ ఈ సైకిల్ను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. అలాగే జీపీఎస్ ట్రాకింగ్, బ్లూటూత్, మొబైల్ యాప్ ఇంటిగ్రేషన్ వంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది.
జియో ఈ-సైకిల్ అధునాతన స్పెసిఫికేషన్లతో ప్రారంభిస్తే జియో ఎలక్ట్రిక్ సైకిల్ భారతీయ ఈ-మొబిలిటీ రంగాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. కచ్చితంగా ప్రజలు ఈ-సైకిల్ను పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నంగా ఎంచుకుంటారు. అయితే టెలికం రంగంలో సంచలనాలకు కారణమైన జియో ఈవీ రంగంలో సంచలనాలకు తెర తీస్తుందో? లేదో? వేచి చూడాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి