Gold Loan: బంగారం వెండి కొనుగోళ్లపై కొత్త రూల్స్! ఇకపై ఆ లోన్స్ తీసుకోలేరు!

బంగారం వెండి కొనుగొళ్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇవి అక్టోబర్ 1, 2025 నుంచి అమలులోకి వచ్చాయి. గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేయాలనుకునేవాళ్లు లేదా లోన్స్ తీసుకునేవాళ్లు ఈ కొత్త రూల్స్ తప్పక తెలుసుకోవాలి.

Gold Loan: బంగారం వెండి కొనుగోళ్లపై కొత్త రూల్స్! ఇకపై ఆ లోన్స్ తీసుకోలేరు!
Gold Loan

Updated on: Oct 05, 2025 | 11:42 AM

దేశంలో బంగారం వెండి ధరలు రోజురోజుకీ పెరుగుతుండడంతో వాటికి సంబంధించి.. ఆర్ బీఐ కొన్ని కొత్త విధానాలు అమలు లోకి తెచ్చింది. బంగారం వెండి లోన్స్ విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్  కీలక మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం కొనుగోలుదారులకు మేలు చేకూరే అవకాశం ఉంది. మారిన రూల్స్ గురించిన మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

ఈ లోన్స్ చెల్లవు

ఆర్‌‌బీఐ కొత్త నిబంధనల ప్రకారం  బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు బంగారం కొనేందుకు గానూ లోన్స్ ఇవ్వకూడదు. అంటే లోన్ తీసుకుని బంగారం లేదా బంగారు ఆభరణాలు, గోల్డ్ ఈటీఎఫ్ ల వంటివి కొనుగోలు చేయకూడదు. గతంలో గోల్డ్ కొనేందుకు కొన్ని బ్యాంక్స్ రుణాలు మంజూరు చేసేవి. అయితే ఇకపై అలాంటి లోన్స్ కు అవకాశం లేదు.

పరిశ్రమలకు కూడా..

గతంలో బంగారు ఆభరణాల వ్యాపారులు మాత్రమే ఆ ఆభరణాలను తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు పొందగలిగేవారు. అయితే, మారిన రూల్స్ ప్రకారం బంగారం, వెండిని ఉపయోగించే పరిశ్రమలు, కర్మాగారాలు కూడా అలాంటి రుణాలను పొందవచ్చు. కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి కూడా ఈ రుణాలు పొందవచ్చు.

ఫ్లోటింగ్ రేట్ లోన్స్‌పై..

ఇకపోతే గతంలో బ్యాంకులు ఫ్లోటింగ్ రేట్ రుణాలపై వడ్డీ రేట్లను ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వాటిని మార్చగలిగేవారు. ఇప్పుడు తరచుగా తగ్గించే అవకాశం బ్యాంకులకు లభించింది. వడ్డీ రేట్లపై జరిగే మోసాలను అరికట్టేందుకే ఈ రూల్ మార్చినట్టు ఆర్‌‌బీఐ చెప్తోంది.

వీళ్లకు బెనిఫిట్..

ఈ కొత్త రూల్స్ వల్ల బంగారం, వెండిపై లోన్స్ తీసుకునేవాళ్లకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అలాగే కొత్త మార్గదర్శకాల ద్వారా బంగారం, వెండి మార్కెట్‌లో మరింత పారదర్శకత ఉంటుందని చెప్తోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us