
ఈఎంఐలో తీసుకున్న మొబైల్ ఫోన్ లోన్స్ డిఫాల్ట్లను తగ్గించడానికి ఫైనాన్స్ కంపెనీలు ఓ కొత్త విధానాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఫైనాన్స్ లో మొబైల్ కొనేటప్పుడు ఫోన్లో ఓ ప్రత్యేక యాప్ను ఇన్స్టాల్ చేయడానికి ఆర్ బీఐ ను అనుమతి అడుగుతున్నారు. ఒకవేళ ఈఎంఐ మిస్ అయితే ఆ యాప్ ద్వారా ఆటోమేటిక్ గా ఫోన్ లాక్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.
ఫైనాన్స్ కంపెనీలు ప్రతిపాదించిన ఈ విధానాన్ని అనుమతించాలా వద్దా అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశీలిస్తోంది. ఒకవేళ ఈ రూల్ అమలు లోకి వస్తే.. ఈఎంఐ మిస్ అయిన డేట్ నుంచి పేమెంట్ క్లియర్ అయ్యే వరకు మొబైల్ ను లాక్ అయిపోవచ్చు.
మరోపక్క ఈ విధానం ద్వారా చాలా మంది మొబైల్ యూజర్స్ కు వాళ్ల డైలీ లైఫ్ యాక్టివిటీస్ దెబ్బ తింటాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్లకు కష్టంగా ఉంటుందని లాయర్లు వాదిస్తున్నారు. ఒకవేళ ఈ రూల్ అమలు లోకి వచ్చినా ఫోన్-లాకింగ్ విధానాలపై నిర్దిష్ట మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉంది. ఫైనాన్స్ కంపెనీలు కస్టమర్ల నుంచి ముందస్తు అనుమతి తీసుకునేలా, అలాగే లాకింగ్ యాప్ ద్వారా వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..