
Ola Electric Scooter: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) భారత మార్కెట్లోకి తన సరికొత్త వేరియంట్ S1 X+ 5.2 kWh ను విడుదల చేసింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ‘4680 భారత్ సెల్’ (4680 Bharat Cell) సాంకేతికతతో వస్తున్న తొలి స్కూటర్ ఇదే కావడం విశేషం. ఓలా ఈ కొత్త స్కూటర్ను రూ.1,29,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ ఆఫర్ ధర ఏప్రిల్ 15, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, ఆ తర్వాత ధర పెరిగే అవకాశం ఉందని కంపెనీ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Akshaya Tritiya 2026: ఈ 92 నిమిషాల్లో బంగారం కొంటే మీ ఇంట్లో సిరుల వర్షమే! ముహూర్తాలు ఇవే..!
ఈ స్కూటర్ కేవలం రేంజ్ విషయంలోనే కాకుండా, వేగం, భద్రతలోనూ అగ్రస్థానంలో నిలుస్తోంది.
సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే సెల్స్ను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటారు. కానీ, ఓలా తన సొంత ల్యాబ్స్లో అభివృద్ధి చేసిన ఈ 4680 భారత్ సెల్ వల్ల ఉత్పత్తి ఖర్చు తగ్గి, సామాన్యులకు కూడా లాంగ్-రేంజ్ స్కూటర్లు అందుబాటులోకి వస్తాయి. ఈ సెల్స్ ఎక్కువ శక్తిని నిల్వ చేయడమే కాకుండా, ఎక్కువ కాలం మన్నేలా రూపొందించారు. “మా అత్యంత అధునాతన ఉత్పత్తుల కోసం రూపొందించిన సాంకేతికతను ఇప్పుడు సామాన్యుల కోసం అందుబాటులోకి తెచ్చాం. ప్రతి భారతీయుడికి ఎలక్ట్రిక్ వాహనం చేరువ కావాలనే మా లక్ష్యంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు.” అని ఓలా ఎలక్ట్రిక్ ప్రతినిధి తెలిపారు.
అద్భుతమైన రేంజ్, అత్యుత్తమ వేగం, స్వదేశీ సాంకేతికత కలగలిసిన Ola S1 X+ 5.2 kWh ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త బెంచ్మార్క్ను సెట్ చేయనుంది. తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక.
ఇది కూడా చదవండి: Gas Cylinders Explode: గ్యాస్ సిలిండర్ ఎందుకు పేలుతుంది? మీ ప్రాణాలను కాపాడుకునే బెస్ట్ టిప్స్ ఇవే!
ఇది కూడా చదవండి: AC Offer: ఏసీ కొనాలని ఉందా? కేవలం రూ.1 కే కొత్త ఏసీని ఇంటికి తీసుకెళ్లండి.. రిలయన్స్ అదిరిపోయే ఆఫర్లు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి