అప్పుడప్పుడు బ్యాంకులు తమ సర్వీసులను మరింత మెరుగు పర్చేందుకు తమ సర్వర్లను అప్గ్రేడ్ చేస్తుంటాయి. ఇక దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ తమ ఖాతాదారులకు అలర్ట్ చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్లాట్ఫారమ్ల నిర్వహణలో భాగంగా తమ బ్యాంకు సేవల్లో కొంత అంతరాయం ఏర్పడనుందని ఖాతాదారులకు సూచించింది. ఈ మేరకు ఈమెయిల్ ద్వారా సందేశాలను కూడా పంపినట్లు సదరు బ్యాంకు తెలిపింది. బ్యాంకు సేవలు జూన్ 9వ తేదీ, అలాగే 16తేదీల్లో సిస్టమ్ అప్గ్రేడ్ కారణంగా వివిధ రకాల సేవల్లో అంతరాయం ఏర్పడనుందని తెలిపింది.
ఈ విషయాన్ని బ్యాంకు వినియోగదారులు గమనించి సహకరించాల్సిందిగా బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాంకు సర్వీస్ సిస్టమ్స్ అప్గ్రేడ్ అయిన తర్వాత యథావిధిగా సేవలు అందుబాటులో ఉంటాయని హెచ్డీఎఫ్సీ బ్యాంకు తెలిపింది.
ఈ అంతరాయం కారణంగా అందుబాటులో ఉండని సేవలు: