
Interesting Story: తులం బంగారం ధర కేవలం 90 రూపాయలు మాత్రమే.. లీటర్ పాలు కేవలం 20 రూపాయలే.. కిలో చక్కెర ధర 40 పైసలు మాత్రమే.. ఇంటి ఈ లెక్కలు చూస్తే వీడికేమైనా మతిపోయినట్లుంది అనుకుంటున్నారా? కానీ అలాంటిదేమి లేదు. మీరు చదవింది నిజమే. కానీ ప్రస్తుతం అనుకుంటే పొరపాటే. ఈ ధరలు 1950వ సంవత్సరంలోనివి. అప్పట్లో ఉండే ధరలను చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. నేడు ఏ వస్తువు కొనాలన్నా వందలు, వేలు ఖర్చు చేయాల్సిందే. పెరుగుతున్న ద్రవ్యోల్బణం (Inflation) సామాన్యుడి నడ్డి విరుస్తోంది. అయితే, స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో అంటే 1950వ సంవత్సరంలో మన దేశంలో ధరలు ఎలా ఉండేవో మీకు తెలుసా? అప్పటి ధరల జాబితాను చూస్తే మనం ఇప్పుడు ఒక పూట భోజనానికి ఖర్చు చేసే డబ్బుతో అప్పట్లో నెలంతా రాజభోగం అనుభవించేవారని అర్థమవుతుంది.
ఇది కూడా చదవండి: Gold Price: మహిళలకు గుడ్న్యూస్.. ఒక్క రోజే భారీగా దిగి వచ్చిన బంగారం ధర.. వెండి పరిస్థితి ఏంటి?
అప్పట్లో వస్తువుల ధరలు ఎంత తక్కువగా ఉండేవో ఈ క్రింది పోలికను బట్టి చూడవచ్చు:
ధరలు తక్కువగా ఉన్నాయి కదా అని అప్పట్లో అందరూ ధనవంతులు అనుకుంటే పొరపాటే. వస్తువుల ధరలతో పాటే ప్రజల ఆదాయం కూడా చాలా తక్కువగా ఉండేది. 1950లలో ఒక సామాన్య ఉద్యోగి నెల జీతం రూ. 30 నుండి రూ. 50 మధ్యలో ఉండేది. ఆ తక్కువ జీతంతోనే అప్పట్లో పెద్ద కుటుంబాలు హాయిగా గడిచిపోయేవి.
జనాభా పెరుగుదల, డిమాండ్ పెరగడం, రూపాయి విలువ తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం వల్ల గత 75 ఏళ్లలో ధరలు ఊహించని రీతిలో పెరిగాయి. అప్పటి ‘పైసల’ కాలం నుండి నేటి ‘వేల’ కాలానికి మన ఆర్థిక వ్యవస్థ భారీ మార్పులకు లోనైంది.
ఇది కూడా చదవండి: Gold Reserves: ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాలు ఏవి? భారతదేశం ఎక్కడ ఉంది?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి